ములుగు, జనవరి 3(నమస్తే తెలంగాణ) : ములుగు ఎస్పీగా 2017 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి డాక్టర్ పీ శబరీష్ను నియమిస్తూ సీఎం శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఎస్పీగా పనిచేస్తున్న గౌష్ఆలంను ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేశారు. ములుగు ఓఎస్డీ అశోక్కుమార్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఓఎస్డీగా బదిలీ చేశారు. జిల్లా ఏర్పడిన తర్వాత రెండో ఎస్పీగా గౌష్ఆలం ములుగు ప్రజలకు విశేష సేవలందించారు.
వరద సమయంలో ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల్లో పోలీస్ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించడంతో పాటు కొంగాల జలపాతంలో వరదల్లో చిక్కుకున్న పర్యాటకులను కాపాడి తన మార్క్ చాటుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.