ఐదో విడుతను విజయవంతం చేయాలి
అభివృద్ధి పనుల్లో సమన్వయంతో
అవగాహన సదస్సుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు
‘నర్మెట, మే 30: పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందాయని, ఈ నేపథ్యంలో జూన్ 3వ తేదీ నుంచి నిర్వహించే ఐదో విడుతను విజయవంతం చేయాలని ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని గ్రామాలు పల్లెప్రగతితో నేడు అన్నివిధాల ప్రగతిలో ఉన్నాయన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, నర్సరీ, సెగ్రిగేషన్షెడ్ ఏర్పాటు చేశారని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గోవర్ధన్ వివరించారు.
గ్రామానికి సుమారు 85వేల మొక్కలు నాటేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నర్మెట మండలం నుంచి పల్లెప్రగతి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన గ్రామానికి రూ.10 వేల నగదును సంబంధిత గ్రామ పంచాయతీకి అందిస్తామని, గ్రామ అధికారులను సన్మానిస్తానని ఆయన తెలిపారు. మండలంలో మొదటి, రెండో స్థానంలో నిలిచిన గ్రామాలకు రూ.3 వేలు, రెండో నగదు బహుమతి రూ.2 వేలు అందిస్తామని వెల్లడించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి పల్లెప్రగతిని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి దామోదర్రావు, జడ్పీ కోఅప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, ఎంపీడీవో ఖాజానయీమొద్దీన్ పాల్గొన్నారు.
బచ్చన్నపేటలో..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడుతున్నదని జిల్లా వ్యవసాయాధికారి, మండల ప్రత్యేకాధికారి వినోద్కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి అధ్యక్షతన పల్లెప్రగతి ఐదో విడుత విజయవంతం కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పల్లెప్రగతిని అమలు చేస్తున్నదన్నారు. గ్రా మాల్లో పల్లెప్రకృతి వనం, నర్సరీ, చెత్త తరలింపునకు డంపింగ్యార్డు, శ్మశానవాటికలు నిర్మించడం ప్రగతికి నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో ఐదో విడుత పల్లెప్రగతిని ప్రజాప్రతినిధులు, అధికారులు విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రఘురామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
లింగాలఘనపురంలో..
వచ్చే నెల 3 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ చిట్ల జయశ్రీ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు. గ్రామాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఆమె కోరారు. ప్రజాప్రతినిధులు సైతం సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొండబోయిన కిరణ్కుమార్, స్పెషల్ ఆఫీసర్ లత, ఇన్చార్జి ఎంపీడీవో సీతారాంనాయుడు, తహసీల్దార్ అంజయ్య, ఎంపీవో మల్లికార్జున్, తిరుమల్ పాల్గొన్నారు.
రఘునాథపల్లిలో..
పల్లెలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని ఎంపీపీ మేకల వరలక్ష్మి, మండల స్పెషల్ ఆఫీసర్ కిరణ్కుమార్ అన్నారు. పల్లెప్రగతి ఐదో విడుత కార్యక్రమంపై మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి పనులు పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేయాలని,. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలన్నారు. పెండింగ్ బిల్లులు రెండు రోజుల్లో విడుదలవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హసీం, ఏపీఎం సారయ్య, ఈసీ శ్రీనివాస్, సర్పంచ్లు పోకల శివకుమార్, బక్క యాదగిరి, ఉత్తెపు ఉమ, కొయ్యడ మల్లేశ్, శ్రీధర్, గుడి రాంరెడ్డి, వెంకట్నాయక్, ఎంపీటీసీ సుల్తాన్ దేవరెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శులు విజయ్, శివ, సంతోష్, జ్యోతి, సీసీలు సంపత్, ఎల్లాస్వామి, రీనావతి పాల్గొన్నారు.
స్టేషన్ఘన్పూర్లో..
వచ్చే నెల 3 నుంచి నిర్వహించే ఐదో విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి ప్రజాప్రతినిధులు, అధికారులను కోరారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన పల్లె , పట్టణ ప్రగతి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో నాలుగు విడుతలుగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ఏమైన లోపాలుంటె సరి చేసుకోవాలని సూచించారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కుమారస్వామి, మండల ప్రత్యేకాధికారి నర్సయ్య, ఎంపీవో సుధీర్కుమార్, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పాలకుర్తిలో..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి, స్టేషన్ఘన్పూర్ ఆర్డీవో కృష్ణవేణి అన్నారు. సోమవారం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జూన్ 3వ తేదీ నుంచి ఐదో విడుత పల్లెప్రగతి ప్రారంభమవుతుందన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందడంతోపాటు పారిశుధ్యం బాగుండి సీజనల్ వ్యాధులు దూరమైనట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాసరావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, తహసీల్దార్ భూక్యా పాల్ సింగ్, ఎంపీడీవో వనపర్తి ఆశోక్కుమార్, ఎంపీవో రవికుమార్, సర్పంచ్లు కల్వల భాస్కర్రెడ్డి, పోగు రాజేశ్వరీశ్రీనివాస్, నాయిని మల్లారెడ్డి, మంద కొమురయ్య, గంట పద్మాభాస్కర్, కత్తి సైదులు, పుస్కూరి పార్వతీరాజేశ్వర్రావు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కొడకండ్లలో..
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని ఎంపీపీ ధరావత్ జ్యోతి, టీఎస్ ఈజీసీ సభ్యుడు అందె యాకయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పల్లెప్రగతిపై నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఐదో విడుత పల్లెప్రగతిలో చేపట్టే పనులను వివరించారు. అధి కారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోరారు. అనంతరం నర్సింగపురం, రామవరం, రామేశ్వరం గ్రామాల సర్పంచులకు వాలీబాల్ ఆటకు సంబంధించిన సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రవీందర్, వైస్ ఎంపీపీ వీరసోములు, ఎంపీడీవో సురేందర్ నాయక్, ఎంపీవో శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఇందిర, ఏపీవో కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.
చిల్పూరులో..
గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి రామలింగాచారి కోరారు. సోమవారం మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీడీవో వేణుగోపాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామలింగాచారి మాట్లాడుతూ గ్రామాల్లో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని కోరారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తయ్యేలా అధికారులు చర్య తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఉద్దెమారి రాజ్కుమార్, కందుల రఘుపతి, ఎంపీడీవో వేణుగోపాల్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.