రాష్ట్రంలో బీఆర్ఎస్తోనే సంక్షేమ పాలన సాధ్యమని, కాంగ్రెస్కు ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. తరిగొప్పుల మండలం సోలిపురం, పోతారం, అక్కరాజుపల్లి, మర్యాపురం, నర్సాపురం, అబ్దుల్నాగారం గ్రామాల్లో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించగా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మ్యానిఫెస్టో గురించి పల్లా వివరించారు. సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని చెప్పారు. పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరగా, గులాబీ కండువాలు కప్పిఆహ్వానించారు. శుక్రవారం జనగామ మండలంలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.
తరిగొప్పుల, అక్టోబర్ 19: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగేందుకు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్సీ, జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రెండో రోజు మండలంలోని సోలిపురం పోచమ్మతల్లి దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి సోలిపురం, పోతారం, అక్కరాజుపల్లి, మర్యాపురం, నర్సాపురం, అబ్దుల్నాగారం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించి మండలాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పారు. గతంలో గుక్కెడు తాగునీటి కోసం అల్లాడిపోగా సీఎం కేసీఆర్ ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తున్నారని చెప్పారు. ప్రతి గ్రామానికి వందశాతం సీసీ రోడ్లు, పెండింగ్ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, రైతులకు 24 గంటల వంటి అనేక పథకాలను అమలు చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్దేనని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎంపీపీ జొన్నగోని హరితా సుదర్శన్ గౌడ్, జడ్పీటీసీ ముద్దసాని పద్మజా వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ చెన్నూరి ప్రమీలా సంజీవ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్రెడ్డి, అధికార ప్రతినిధి చిలువేరు లింగం, మండల కోఆర్డినేటర్ జొన్నగోని కిష్టయ్యగౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బీరెడ్డి జార్జిరెడ్డి, అర్జుల రమ, అమిరిశెట్టి వీరేందర్, దామెర ప్రభుదాస్, బెల్లం రాజు, ఎంపీటీసీలు అర్జుల మధుసూదన్రెడ్డి, భూక్యా జూంలాల్నాయక్, తుపాకుల మంగ, మండల నాయకులు తాళ్లపల్లి రాజేశ్వర్ గౌడ్, వంగ బీమయ్య, వంగ రామరాజు, యూత్ నాయకుడు మాల్యాల సుధీర్, పోగుల అశోక్, తుపాకుల సత్తయ్య పాల్గొన్నారు.
జనగామ రూరల్: జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పార్టీ మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరి గౌడ్ తెలిపారు. ఉదయం 9గంటలకు చీటకోడూర్, 10 గంటలకు చౌడారం, 11 గంటలకు మరిగడి, 12 గంటలకు పెద్దతండా(ఎం)లో ఎన్నికల ప్రచారం ఉంటుందని, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.