వరంగల్, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని శనివారం ఆయన చాంబర్లో కలిసి వారి రాజీనామా పత్రాలను సమర్పించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వెంటనే వీరి రాజీనామాలను ఆమోదించారు. ఒకే పదవిలో ఉండాలనే నిబంధనల మేరకు ఈ ముగ్గురు ఈ నిర్ణయం తీసుకున్నారు. కడియం శ్రీహరి, పాడి కౌశిక్రెడ్డి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా 2021లో ఎన్నికయ్యారు. కాగా, పల్లా రాజేశ్వర్రెడ్డి 2021లో జరిగిన గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్లో, పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామలో, పాడి కౌశిక్రెడ్డి హుజూరాబాద్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో వారి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.