కృష్ణకాలనీ, జనవరి 23 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో మూడు రోజులుగా ని ర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సాప్ట్బాల్ పో టీ లు సోమవారం ముగిశాయి. ఉత్కంఠ పోరులో చాంపియన్గా రంగారెడ్డి జట్టు నిలిచింది. విజేతలకు టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి అడహక్ కమిటీ నాయకుడు బడితల సమ్మయ్య, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి బుర్ర సునీత ముఖ్యఅతిథులుగా హాజరై బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ క్రీడాకారులు నిరంతరం సాధ న చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారన్నారు తద్వారా క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
చాంపియన్గా రంగారెడ్డి జట్టు
సెమీఫైనల్లో భూపాలపల్లి, మెదక్ జట్లు పోటీపడగా మెదక్ జట్టు విజయం సాధిం చి సెమీఫైనల్కు అర్హత సాధించింది. మ హబూబ్నగర్, హనుమకొండ జట్లు తలపడగా హనుమకొండ జుట్ట గెలిచి సమీఫైనల్ చేరుకుంది. అనంతరం హనుమకొం డ జట్టుపై రంగారెడ్డి జట్టు విజయం సాధించగా, నిజామాబాద్పై మెదక్ జట్టు గెలుపొందింది. ఫైనల్స్లో రంగారెడ్డి, మె దక్ జట్లు పోటీపడగా రంగారెడ్డి జట్టు 7-3 రన్స్తో గెలిచి చాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. మెదక్ జట్టు రన్నరప్గా నిలిచింది. హనుమకొండ జట్టుపై 4-8 రన్స్తో నిజామాబాద్ జట్టు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. సింగరేణి సూపర్వైజర్ పర్శ శ్రీనివాస్, సిరిమల్ల శ్రీనివాస్, స్పోర్ట్స్ ఆర్గనైజర్లు జీ శ్రీకాంత్, బైరి సాయి పాల్గొన్నారు.