నమస్తే తెలంగాణ నెట్వర్క్ : నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష చేసిన ముస్లింలు శనివారం రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఒకరినొకరు అలయ్.. బలయ్తో ఆత్మీయంగా పలకరించారు. అల్లా చూపిన మార్గంలో పయనించాలని ముస్లిం మత బోధకులు పిలుపునిచ్చారు.
మతసామరస్యానికి ప్రతీకైన రంజాన్ సందర్భంగా వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్లో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, స్టేషన్ఘన్పూర్లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మరిపెడలో మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, వరంగల్ ఎల్బీ నగర్లోని ఈద్గాలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.