పాలకుర్తి రూరల్/దేవరుప్పుల, మే 26: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో యువకుడు, విద్యావంతుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి, దేవరుప్పుల మండలాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో వేర్వేరుగా నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వీటిని నెరవేర్చలేదని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో మళ్లీ నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ యత్నిస్తున్నాయని తెలిపారు. నిజాయితీపరుడు, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డిని పెద్దల సభకు పంపేందుకు పట్టభద్రులు ఓటేసి గెలిపించాలని ఎర్రబెల్లి కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులు, పార్టీ నాయకుల అండతో రాకేశ్రెడ్డి గెలుపు ఖాయమైందన్నారు. పాలకుర్తిలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ మండల ఎన్నికల ఇన్చార్జి పల్లా సుందర్రామిరెడ్డి, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావు, పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల ఆశోక్రెడ్డి, మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, జర్పుల బాలునాయక్, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, కమ్మగాని నాగన్న, కడుదుల కర్ణాకర్రెడ్డి, చిలుకమారి నాగేశ్వర్ పాల్గొన్నారు. దేవరుప్పులలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, ప్రధాన కార్యదర్శి చింత రవి, నాయకులు పల్లా సుందరరాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లింగాల రమేశ్రెడ్డి, వైస్ ఎం పీపీ కత్తుల విజయ్కుమార్రెడ్డి, నాయకులు ఈదునూరి నర్సింహారెడ్డి, బస్వ మల్లేశ్, కొల్లూరుసోమయ్య, ఏల సుందర్, జోగు సోమనర్సయ్య,ధరావత్ రాంసింగ్, కు తాటి నర్సింహులు, బిళ్ల యాదవరెడ్డి, అనంతోజు కృష్ణమూర్తి, ఆలకుంట్ల యాదగిరి, తిరుమలేశ్ పాల్గొన్నారు.