దేవరుప్పుల/పాలకుర్తి రూరల్, మార్చి 12: దేవాదుల రిజర్వాయర్లలో నీళ్లున్నా యాసంగి పంటలకు సర్కారు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి మండల కేంద్రాల్లో మంగళవారం రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించి ఎండిన వరి, మక్కజొన్న కర్రలతో నిరసన వ్యక్తం చేశారు. దేశానికి అన్నంపెట్టే అన్నదాతలను పాలకులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందరరాంరెడ్డి, పాలకుర్తి ఎంపీపీ నల్లా నాగిరెడ్డి మాట్లాడుతూ దేవాదుల రిజర్వాయర్లలో జలాలున్నా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వరి, మక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపరిహారంగా ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు రైతులకు ఎన్నో హామీలిచ్చి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయాన్ని పండుగలా మార్చామని, సాగునీటి సమస్య లేకుండా చూశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులందరికీ రైతుబంధు సాయం అందలేదని, రూ.2 లక్షల రుణ మాఫీ నెరవేరలేదన్నారు. దీనిపై రైతులంతా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, ప్రధాన కార్యదర్శి చింత రవి, నాయకులు బస్వ మల్లేశ్, ధరావత్ రాంసింగ్, కొల్లూరు సోమయ్య, కారుపోతుల భిక్షపతి, పాము మోహన్, మైదం జోగేశ్వర్, హనుమంతు, వంగ అర్జున్, బోనగిరి యాకస్వామి, మేకల సంపత్, మాచర్ల బాబు, జేరిపోతుల సాయిలు, కుతాటి నర్సింహులు, గండిపల్లి యాకయ్య, తాటిపల్లి మహేశ్, బస్వ వెంకన్న, కాముని నర్సింహాస్వామి, తిరుమలేశ్ పాల్గొన్నారు. పాలకుర్తిలో నిర్వహించిన రాస్తారోకోలో బీఆర్ఎస్ పాలకుర్తి మండల అధ్యక్షుడు పసునూరి నవీన్కుమార్, నాయకులు బొబ్బల ఆశోక్రెడ్డి, మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, పాము శ్రీనివాస్, కమ్మగాని నాగన్న, తాడెం రవి, గూడ రాఘవులు, మాటూరి యాకయ్య, నకీర్త యాకయ్య, కల్వల భాస్కర్రెడ్డి, ఎండీ మదార్, ఎండీ సర్వర్ ఖాన్, కడుదుల కర్ణాకర్రెడ్డి, పోశాల వెంకన్న, మారుజోడు సంతోష్కుమార్ పాల్గొన్నారు.