హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 23 : దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన సమయంలో సరళీకృత సంసరణలతో ఆర్థిక వ్యవస్థ గతిని మార్చిన గొప్ప దార్శనికుడు పీవీ నరసింహారావు అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. తొలి తెలుగు ప్రధాని పాములపర్తి వెంకట నర్సింహారావు వర్ధంతిని పురసరించుకుని హనుమకొండ బస్టాండ్ సరిల్ వద్ద పీవీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్, జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ దేశానికి ఆయన ఆర్థిక సంసరణలు దిశా నిర్దేశం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన సేవలను గుర్తించలేని స్థితిలో ఉందన్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆయన సేవలను స్మరిస్తూ పీవీ జన్మస్థలమైన వంగరలో ఆయన చరిత్రను తెలిపేలా మ్యూజియం నిర్మించినట్లు చెప్పారు. పీవీ విశిష్ట సేవలను గౌరవిస్తూ ఆయన పేరు మీద వెటర్నరీ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, వామన్రావు తదితరులు పాల్గొన్నారు.