మహదేవపూర్, జూలై 4 : రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంపుహౌస్ను సందర్శిస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. శనివారం ఆయన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కన్నెపల్లిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయన్న సాకుతో రెండేళ్లుగా మేడిగడ్డ బరాజ్లో నీటిని నిల్వ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రతిరోజు ఒక టీఎంసీ నీరు వృథాగా పోతున్నదని, సీఎం, స్థానిక ఎమ్మెల్యే ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆయన విమర్శించారు.
రెండేళ్లుగా ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేయకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మధు పిలుపునిచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్రావు, మండల యూత్ మాజీ అధ్యక్షుడు ఎండీ అలీంఖాన్, నాయకులు అన్కారీ ప్రకాశ్, తడకల రమేశ్, ఆరుట్ల పవన్, లేతకరి ఆనంద్, నిట్టూరి సాయి, శ్యామ్, మహేందర్, రాకేశ్, సతీశ్, సాయి, చకినారపు శశి తదితరులు పాల్గొన్నారు.