విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి
కలెక్టర్ శశాంక
తిర్మలాపురంలో పల్లెప్రగతి పనుల పరిశీలన
కురవి, జూన్17 : పల్లెప్రగతి పనుల్లో ప్రజలంతా కలిసికట్టుగా పాల్గొని పల్లెలను అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ శశాంక సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని తిర్మలాపురం గ్రామంలో పల్లెప్రగతి పనులను పర్యవేక్షించారు. ముందుగా బృహత్ పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించి అధికారులు, ప్రజాప్రతినిధులను అభినందించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బృహత్ పల్లెప్రకృతివనంలో సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయాలన్నా రు. ఉపాధి పథకంలో భాగంగా నీటిగుంతలు నిర్మిం చి వర్షపు నీటిని నిల్వ చేసి వాడుకోవాలన్నారు. బృహత్ పల్లెప్రకృతి వనం అభివృద్ధికి కృషి చేసిన విలేజ్ టీంను అభినందించి స్వయంగా మొక్కలు నాటారు. అనంతరం తిర్మలాపురం గ్రామంలోని గ్రామ పంచాయతీ, ప్రాథమి క పాఠశాల, పెద్దచెరువును సందర్శించారు. పాఠశాలకు ఎదురుగా నిరుపయోగంగా ఉన్న ఇంటిని తొలగించాలన్నారు. గదుల మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని పీఆర్ఏఈ శ్రీనివాస్ను ఆదేశించారు. గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ పనితీరును మెరుగుపర్చాలని, పిల్లలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని సీడీపీవో ఎల్లమ్మ, సూపర్వైజర్ గోపమ్మ, ఆశకార్యకర్త రాధికను ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానలపై నమ్మ కం కలిగేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. హరితహారం నర్సరీని సందర్శించి మొక్కల పెరుగుదలకు జీవామృతం వేయాలని నిర్వాహకులకు సూచించారు. గ్రామంలోని 210 ఇళ్లలో ప్రతిరోజూ చెత్త సేకరణ జరపాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాంబాబు, ఉప సర్పంచ్ సుధాకర్గౌడ్, డీఆర్డీవో సన్యాసయ్య, ఎంపీడీవో సరస్వతి, విద్యుత్ డీఈ సునీత, హెచ్ఎం వెంకన్న, పంచాయతీ సెక్రటరీ రామకృష్ణ, ఈజీఎస్ ఏపీవో ఏకాంబ్రం, ఎంపీవో పద్మ, నర్సింహారావు పాల్గొన్నారు.
విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, కష్టపడి చదివి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ శశాంక సూచించారు. శుక్రవారం ఆయన మండల కేంద్రం శివారులోని ఏకలవ్య మోడల్స్కూల్ను సందర్శించి, అదనపు డార్మెంటరీ, స్పోర్ట్స్గ్రౌండ్ పనులను పరిశీలించారు. గురుకుల విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశా రు. అదనపు డార్మెంటరీ, జీ ప్లస్- 2గదుల నిర్మాణంతోపాటు అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటు విషయమై సంబంధిత అధికారులతో సమీక్షించారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, త్రోబాల్, జావెలిన్ త్రో, లాంగ్జంప్, హైజంప్, బాస్కెట్ బాల్ గ్రౌండ్ల ఏర్పాటు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అథ్లెటిక్స్ కోసం ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేయాలన్నారు. కొత్త, పాత భవనాలకు పెయింటింగ్ వేయించాలని, కిటికీలకు గ్రిల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదలతో చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మంచి పేరు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండి వెంకట్రెడ్డి, ప్రిన్సిపాల్ సరిత, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ హేమలత, ఆర్సీవో రాజ్యలక్ష్మి, ఏఈ ప్రశాంత్, తహసీల్దార్ ఇమ్మాన్యుయేల్, ఆర్ఐ రహెమాన్, ఎంపీడీవో సరస్వతి పాల్గొన్నారు.