కాజీపేట, ఆగస్టు 4: ఉత్తర, దక్షిణ భారతానికి ముఖ ద్వారంగా, రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన కాజీపేట రైల్వే జంక్షన్ అమృత్ భారత్ పథకానికి ఎంపికైంది. దీంతో జంక్షన్ రూపు రేఖలు త్వరలోనే మారనున్నాయి. ఈ పథకంలో ఎంపికైన కాజీపేట రైల్వే జంక్షన్ అభివృద్ధికి 24కోట్ల 45 లక్షలను మంజూరు చేశారు. ఈ పనులను ఈ నెల 6న దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఆన్ లైన్లో ప్రారంభించనున్నారు.
సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని కాజీపేట రైల్వే స్టేషన్ 1904లో నైజాం స్టేట్ రైల్వేగా ప్రారంభ మైంది. తరువాత రైలు ప్రయాణికుల సౌకర్యార్ధం అన్ని హంగులతో 1973లో కాజీపేట రైల్వే జంక్షన్గా రీమో డలింగ్ జరిగింది. జిల్లాలోనే ముఖ్య రైల్వే స్టేషన్గా, దక్షిణ మధ్య రైల్వే జోన్లోని సికింద్రాబాద్ రైల్వే డివి జన్కు అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెట్టేదిగా పేరొందింది. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని ఎన్ఎస్జీ కేటగిరీ లోని కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా ప్రతి రోజూ దాదా పు వంద ప్రయాణికుల రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. దాదాపు 25 వేల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు రాకపోకలు జరుపుతారు. ఈ రైల్వే జంక్షన్ ప్రతి ఏడాది దక్షిణ మధ్య రైల్వేకు సుమారుగా రూ. 41.36 కోట్ల వార్షి క ఆదాయాన్ని అందిస్తుంది. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి త్వ శాఖ చేపట్టిన అమృత్ భారత్ పథకంలో కాజీపేట రైల్వే జంక్షన్ ఎంపికైంది.
దీంతో ఈ జంక్షన్ రూపురేఖలు మార్చాలని రైల్వే మంత్రిత్వ శాఖ 24కోట్ల 45 లక్షల నిధులను మంజూరు చేసింది. మొదటి దశలో కాజీపేట రైల్వే జంక్షన్ను విమానాశ్రయాన్ని తలపించేలా నూతన హంగులతో అన్ని విధాలా ఆధునీకరించేందుకు రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. రైల్వే జంక్షన్కు ఆనుకున్న అన్ని పాత భవనాలను తొలగించేందుకు ఇటీవలే సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అమృత్ భారత్ మొ దటి దశ పనులకు ఈ నెల 6న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైభవ్ తదితరులు ఆన్లైన్ లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకంలో కాజీపేట రైల్వే జంక్షన్లో ముఖ్య భవనం, ముఖ ద్వారం, అధు నాతన సౌకర్యాలతో ప్లాట్ఫారాలు, మరో రెండు పెంచ డం, మహిళలు, పురుషులకు వేర్వేరుగా కంబైండ్ ఏసీ వెయిటింగ్ హాల్, టాయిలెట్లు, 12 మీటర్ల వైశాల్యంతో ఎఫ్ఓబీలు, మరో రెండు ఎక్సలేటర్లు, రెండు లిఫ్ట్లు, జంక్షన్ ముందు ప్రయాణికులకు గార్డెన్, పార్కింగ్, రైల్వే జంక్షన్ ప్రాంగణంలో రైలు బోగీని పోలిన తరహా లో రెస్టారెంట్, సక్యూలైటింగ్ ఏరియా సుందరీకరణ తదితర పనులను చేపట్టనున్నారు.
కాజీపేట రైల్వే జంక్షన్లో జరిగే అమృత్ భారత్ పథ కం పనులకు ప్రధాని నరేంద్రమోడీ రేపు దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఆన్లైన్ సిస్టంతో శంకుస్థాపన చేయనున్నా రు. ఈ పనులకు కావాల్సిన అన్ని వసతులను రైల్వే సీని యర్ డీఈఈ అనంత్ కృష్ణ సాయి ఆధ్వర్యంలో రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా మంత్రులు, కలెక్టర్, శాసన మండలి వైస్ చైర్మన్, ఎంపీలు, నగర మేయర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, వివిధ రాజకీయ పార్టీల బాధ్యులకు ఆహ్వానం అందజేశారు.