హనుమకొండ, మార్చి 13: కాంగ్రెస్, బీజేపీ నాయకులు విధ్వంస రాజకీయాలు మాని, నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చేతల్లో చూపాలని, కూల్చివేతల్లో కాదని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వడ్డేపల్లిలోని ముదిరాజ్ వాడలో రోడ్ వైడనింగ్ కోసం రూ.45 లక్షల నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన శిలాఫలకం ఏర్పాటు చేయగా, గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారన్నారు. అక్క డ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రా జేందర్రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వినయ్ భాసర్ తెచ్చిన నిధులకే నేడు శంకుస్థాపనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీ, మున్సిపల్ కమిషనర్, హనుమకొండ ఏసీపీని వారు కోరారు. సమావేశంలో కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వ ర్రావు, చెన్నం మధు, సంకు నర్సింగ్, సోదా కిరణ్, ఇమ్మడి లోహిత, బీఆర్ఎస్ నాయకులు పులి రజినీకాంత్, నయీముద్దీన్, దువ్వ కనకరాజ్, ఖలీల్, శ్రీకాంత్చారి, కల్యాణ్, ప్రభు, చిన్నా, ఇస్మాయిల్, ఇమ్మడి రాజు తదితరులు పాల్గొన్నారు.