జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : నేడు సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం భూపాలపల్లి ఏరియాలో యాజమాన్యం ఏర్పాట్లు పూర్తిచేసింది. తొమ్మిది పోలింగ్ కేంద్రాలు, అంబేద్కర్ స్టేడియంలోని మినీ ఫంక్షన్ హాల్లో కౌంటింగ్కు ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 7 గంటల నుంచి లెక్కింపు ప్రారంభించి అర్ధరాత్రి వరకు ఫలితాలు వెల్లడించనున్నారు. పోలింగ్ కోసం 68మంది సిబ్బందిని నియమించగా 109 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. భూపాలపల్లి ఏరియాలో 5,410 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 13 కార్మిక సంఘాలు బరిలో నిలువగా నేడు రాత్రి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల భవితవ్యం తేలనుంది. 5 టేబుళ్లను ఏర్పాటు చేసి రెండు రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ నరేశ్కుమార్ సింగరేణి అతిథి గృహంలో పోలింగ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి బ్యాలెట్ బాక్స్లను అందజేశారు. డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయం నుంచి ఐదుగురు బృందం భూపాలపల్లికి చేరుకుని ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు.
సింగరేణి గుర్తింపు ఎన్నికల కోసం సింగరేణి యాజమాన్యం 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేటీకే-1 ఇైంక్లెన్ వెల్ఫేర్ కార్యాలయంలో ఒక కేంద్రం ఏర్పాటు చేయగా 596మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే ఇదే గనిపై సర్వే రూంలో ఏర్పాటుచేసిన రెండో కేంద్రంలో 671మంది, కేటీకే-5 ఇైంక్లెన్లో పీవోఏ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మూడో కేంద్రంలో 680మంది, ఇదే గనిపై వెల్ఫే ర్ అధికారి కార్యాలయంలోని నాలుగో కేంద్రంలో 691మంది, కేటీకే-6 ఇైంక్లెన్లో ఏర్పాటు చేసిన ఐదో కేంద్రంలో 712 మంది, యైటిైంక్లెన్పై ఉన్న ఓసీ సైట్ ఆఫీస్లోని ఆరో పోలింగ్ కేంద్రం లో 582మంది, ఇదే గనిపై క్యాంటీన్ హాల్లో ఏర్పాటుచేసిన ఏడో కేంద్రంలో 650మంది, మైన్స్ రెస్క్యూ సెంటర్లో ఏర్పాటు చేసిన ఎనిమిదో కేంద్రంలో 572మంది, ఓసీ-2 సైట్ ఆఫీస్లో ఏర్పాటుచేసిన తొమ్మిదో పోలింగ్ కేంద్రంలో 256మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.