దేవరుప్పుల, ఆగస్టు4: మండల పరిధిలోని సీతారాంపురం స్టేజీ సమీపంలో 68 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి తరలిస్తున్నారనే ముందస్తు సమాచా రంతో సీతారాంపురం పరిధిలోని జాతీయ రహదారిపై కాపుకాచి సూర్యాపేట వైపు నుంచి వస్తున్న ట్రాలీ వ్యాన్ను ఆపి తనిఖీ చేశాం. దీంతో స్టీరింగ్ ముందు భాగం లోపల 31 ప్యాకింగ్లు బయట పడ్డాయి. వాటిని తెరిచి చూడగా రూ. 10 లక్షల 60 వేల విలువ చేసే గంజాయి కనిపించింది. ఈ సరుకు ఒడిశాలోని చిత్రాఖండ్ నుంచి మహా రాష్ట్ర లోని ముంబైకి వెళ్తున్నది.
తహసీల్దార్ రవీందర్ రెడ్డి సమక్షంలో పంచనామా చేసి, గంజాయి ప్యా క్లను విప్పి తూకం వేశారు. గంజాయిని సీజ్ చేసి, నిందితులు ఖమ్మం జిల్లా ఏనుకూరు మండ లం అరికలపాడుకు చెందిన కమర్తపు వినయ్, బొమ్మకుమార్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రవణ్కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో హెడ్ కాని స్టేబుల్ శ్యాంసుందర్, కానిస్టేబుళ్లు యాకూబ్, అశోక్, ఆర్ఐ రాజు, వీఆర్ఏ శ్రీనివాస్ తదితరు లు ఉన్నారు.