ములుగు జిల్లాలోని 174 జీపీల్లోని 352 ప్రాంతాల్లో స్థలాల గుర్తింపు
ప్రతి ప్రాంగణానికి రూ. 5 లక్షలు
ఈజీఎస్ నిధులతో అభివృద్ధికి ప్రణాళికలు
మైదానాల చుట్టూ నీడనిచ్చే మొక్కల పెంపకం
జూన్ 2న మండలానికి రెండు చొప్పున ప్రారంభం
ఏర్పాట్లు చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగం
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి, క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఊరికో ఆట స్థలాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక్కో ప్రాంగణానికి రూ. 5 లక్షలు కేటాయించింది. ములుగు జిల్లాలోని 174 గ్రామ పంచాయతీల పరిధిలో 352 ప్రాంతాల్లో స్థలాలను అధికారులు గుర్తించారు. గ్రౌండ్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో లాంటి ఐదు రకాల క్రీడలకు కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో నీడనిచ్చే, ఆహ్లాదభరితంగా ఉండే మొక్కలు నాటనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న మొదట మండలానికి రెండు గ్రామాల్లో క్రీడా మైదానాలను ప్రా రంభించనున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో వీటిని అభివృద్ధి చేయనున్నారు.
ములుగు, మే30(నమస్తేతెలంగాణ): రాష్ట్ర ప్రభు త్వం పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామంలో ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామం, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఏర్పాటు చేయడంతో గ్రామాల రూపురేఖలు మారా యి. ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న మట్టిలోని మాణిక్యా లను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రతి గ్రామం లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ములు గు జిల్లాలో 9 మండలాల్లో 174 గ్రామ పంచాయతీల పరిధిలో 352 ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పా టు చేసేందుకు కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య నేతృత్వంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో క్రీడా ప్రాంగ ణానికి ఎకరం నుంచి ఎకరంన్నర స్థలాన్ని తహసీల్దా ర్లు గుర్తించి, వాటి నిర్మాణం కోసం స్థలాన్ని ఆయా మండలాల ఎంపీడీఓలకు అప్ప గించారు. డీఆర్డీఏ ద్వారా ఉపాధి హామీ నిధులతో చేపట్టేందుకు ఒక్కో మైదానానికి రూ.5లక్షలను కేటాయించారు. వీటితో క్రీడా ప్రాంగణాల స్థలాన్ని చదును చేయడం, ముళ్ల పొదలను తొలగించడం, మొరం నింపడం వంటి పను లను ఉపాధి కూలీలు చేయనున్నారు.
జూన్ 2న మండలానికి రెండు..
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ప్రతి మండలంలో రెండు క్రీడా ప్రాంగణాల నిర్మాణా లను పూర్తి చేసి అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ప్రాంగణంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్జంప్, సింగిల్, లేదా డబుల్ వ్యాయమ బార్లను ఏర్పాటు చేయనున్నారు. 5 క్రీడాంశాలకు సంబంధించిన కొలతలు, ప్రాంగణానికి ఆర్చి నిర్మాణం, చుట్టూ గ్రీనరీ ఉండేందుకు ప్లాంటేషన్ నిర్మాణం చేపట్టనున్నారు. వీటన్నింటి పర్యవేక్షణకు మండలానికి ఒక్కో ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెలో ప్రభుత్వ స్థలంలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి గ్రామాలకు అప్పగించనున్నారు.
352 ప్రాంతాల్లో క్రీడా స్థలాల గుర్తింపు
పల్లె ప్రగతి కార్యక్ర మంలో భాగంగా కలెక్ట ర్ ఆదేశాల మేరకు 174 జీపీల పరిధిలో 352 ప్రాంతాల్లో క్రీడా ప్రాంగ ణాలను ఏర్పాటు చేస్తు న్నాం. ఇందుకోసం స్థలా లను గుర్తించి పనులను ప్రారంభించేందుకు చర్య లు చేపట్టాం. జూన్ 2వ తేదీ నాటికి ప్రతి మండ లంలో రెండు క్రీడా ప్రాంగణాలను ప్రారంభించ నున్నాం. ఈజీఎస్ నిధులతో ఒక్కో క్రీడా ప్రాంగ ణానికి రూ. 5 లక్షలు ఖర్చు చేయనున్నాం.
– ఎం వెంకటనారాయణ, డీఆర్డీఏ పీడీ, ములుగు