]హనుమకొండ/ నర్సంపేట, డిసెంబర్ 31 : న్యూఇయర్కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం అర్ధరాత్రి కేక్లు కట్ చేశారు. 2023కు వీడ్కోలు పలుకుతూ 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగరంతోపాటు వరంగల్, హనుమకొండ జిల్లాలోని పలు పట్టణాల్లో బేకరీలు కొనుగోలు దారులతో సందడిగా మారాయి. ప్రజలు పెద్ద ఎత్తున కేక్లు కొనుగోలు చేసి ఇండ్లకు తీసుకెళ్లారు. అలాగే, నూతన సంవత్సరం రంగురంగుల ముగ్గులు వేయడానికి సిద్ధం చేసుకున్నారు.
ఈ మేరకు మహిళలు రంగులు కొనుగోలు చేశారు. కాగా, హనుమకొండలోని స్వధార్ మహిళా ఆశ్రమంలో అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఆదివారం ఆశ్రమంలో 2023కు వీడ్కోలు పలుకుతూ 2024ను స్వాగతిస్తూ సొసైటీ అధ్యక్షురాలు అనితారెడ్డి పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో శైలజ, అరుణజ్యోతి పాల్గొన్నారు.