లింగాలఘనపురం, నవంబర్ 1 : పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో చేపట్టిన సంస్కరణలతో నెల్లుట్లకు జాతీయ అవార్డు వచ్చిందని బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్ధి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని నెల్లుట్ల, పటేలుగూడెం, నవాబుపేట, వడిచర్ల, నేలపోగుల, వనపర్తి, కొత్తపెల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ గ్రామ శాఖల అధ్యక్షులు మోటె వీరస్వామి, కరుణాకర్, రాము, దూసరి వెంకన్న,యాదగిరి, రాజశేకర్రెడ్డి, దూసరి గణపతిల అధ్యక్షతన బుధవారం జరిగిన ఆత్మీయ సమావేశాల్లో కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా ఉండాలని సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలతో నెల్లుట్లకు రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు లభిందన్నారు. ఇప్పటి వరకూ లింగాలఘనపురం, రఘునాధపల్లి మండలాలకు ఎమ్మెల్యేగా సేవ చేసే అవకాశం తనకు లభించలేదన్నారు. ఒక్కసారి అవకాశమిచ్చి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. నిస్వార్దంగా సేవ చేసి, అవినీతిరహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలన్నదే తన ఎజెండా అన్నారు. నియోజకవర్గ ఓటర్ల ఆత్మగౌరవానికి ఎలాంటి భంగం కలుగకుండా, వారి విలువ పెంచేలా కృషి చేస్తానని కడియం శ్రీహరి అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే నెల్లుట్ల చెరువును సుందరీకరిస్తానన్నారు. ప్రస్తుతం జనగామ పట్టణం నుంచి నెల్లుట్ల చెరువులోకి వస్తున్న మురుగునీరును పైపులైన్ ద్వారా వేరు చేస్తానన్నారు. నెల్లుట్ల వాగుపై చెక్డ్యామ్ నిర్మింప జేస్తానన్నారు. పటేలుగూడెం, నవాబుపేట రైతులకు సాగు నీటి సౌకర్యం కలిగిస్తానన్నారు. వడిచర్ల వడ్డెరకాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం, నవాబుపేట శ్రీకోదండరామస్వామి ఆలయానికి కామన్గుడ్ఫండ్(సీజీఎప్)నుంచి రూ.2.30 కోట్లను మంజూరు చేయించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. నేలపోగుల, వనపర్తి, కొత్తపెల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. గ్రామాల్లో మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తానన్నారు.
ఎన్నికలు సమీపించడంతో మాయమాటలు చెప్పేందుకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు నమ్మొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి ప్రజలను కోరారు. రైతుబంధు, పంట రుణాల మాఫీ, దళితబంధు, గొర్రెల పంపిణీ పథకాలకు నగదు బదిలీ నిలిపి వేయాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారని, విపక్షాల మాటలను ప్రజలు నమ్మరని వివరించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కడియం శ్రీహరి కోరారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు బస్వగాని శ్రీనివాస్గౌడ్, గవ్వల మల్లేశం, నెల్లుట్ల సర్పంచ్ చిట్ల స్వరూపరాణి భూపాల్రెడ్డి, నర్సింగ్ రామకృష్ణ, గుర్రం బాలరాజుగౌడ్, నల్ల మైసయ్య, గొరిగె మల్లయ్య, గోసంగి కిష్టయ్య, బూడిద జయరాజేశ్వర్గౌడ్, బొల్లంపల్లి నాగేందర్, గుర్రం యాదగిరి, వంగ నాగరాజు, గాడిపెల్లి శ్రీనివాస్, దూసరి గణపతి, ఉడుగుల భాగ్యలక్ష్మి, గండి యాదగిరి, గుగ్గిళ్ల హరికృష్ణ, ఏదునూరి వీరన్న, కేమిడి యాదగిరి, గణేశ్, దూసరి సోమనర్సయ్య, బోయిని రాజు, తీగల సిద్ధ్దుగౌడ్, కూకట్ల మల్లయ్య, గండి శ్రీనివాస్, జగ్గం ఆనంద్, కత్తుల శ్రీపాల్రెడ్డి, కడారి కృష్ణ, ఉంగరాల శ్రీధర్, గోలి రాజు, మేడె తిరుమల్, గట్టగల్ల శ్రీహరి, తుంగ స్రవంతి నాగరాజు, గాదెపాక విష్ణు, కొత్తకొండ గంగాధర్ పాల్గొన్నారు.