పరకాల, ఆగస్టు 27 : దేశానికే తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీకి చెందిన 663 మందికి నూతనంగా మంజూరైన పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారదర్శక పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నబర్వన్ స్థానంలో నిలిపారన్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు లబ్ధి చేకూరేలా పాలన చేస్తుందని విమర్శించారు. కాగా, దళితబంధు పథకంలో భాగంగా మంజూరైన కూల్డ్రింక్స్ షాపును ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్ స్వామి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, కౌన్సిలర్లు మడికొండ సంపత్కుమార్, ఒంటేరు సారయ్య, పొరం డ్ల సంతోష్, గొర్రె స్రవంతి, దామెర మొగిలి, నలెల్ల జ్యోతి, అడప రాము, పసుల లావణ్య, బండి రాణి, శనిగరపు రజిని, మార్క ఉమాదేవి, చందుపట్ల సుజాత, పాలకుర్తి గోపి, ఏకు రాజు, పంచగిరి జయమ్మ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, చందుపట్ల తిరుపతిరెడ్డి, శనిగరపు నవీ న్, పావుశెట్టి వెంకటేశ్వర్లు, దగ్గు విజేందర్, పంచగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
నీరుకుళ్లలో..
ఆత్మకూరు : మండలంలోని నీరుకుళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో 149 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆసరా పింఛన్ కార్డులను అందజేశారు. సర్పంచ్ అర్షం బలరాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గానికి 3 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరయ్యాయని, త్వరలోనే అర్హత కలిగిన వారికి ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, ఏపీవో రాజిరెడ్డి, ఎంపీపీ మార్క సుమలతారజినీకర్గౌడ్, జడ్పీటీసీ కక్కెర్ల రాధికారాజు, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ రవీందర్, పెద్దాపురం, నీరుకుళ్ల పీఏసీఎస్ వైస్ చైర్మన్లు అంబాటి రాజస్వామి, పోతురాజు రాజు, ఎంపీటీసీలు అర్షం వరుణ్గాంధీ, మందపల్లి మమతారవీందర్, సర్పంచ్లు కోరే లలితారమేశ్, మచ్చిక యాదగిరి, ఉపసర్పంచ్ లక్ష్మణ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మానగాని సాంబమూర్తి, శీరంశెట్టి సుమన్ పాల్గొన్నారు.
దామెర మండలంలో..
దామెర : దామెర మండలం పులుకుర్తితోపాటు, ల్యాదెళ్ల గ్రామాల్లో ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే చల్లా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పులుకూర్తిలో కాంగ్రెస్కు చెందిన మాజీ సర్పంచ్ కాశెట్టి అమృతమ్మ, కాశెట్టి సదానందం(డాక్టర్), రమేశ్, కుమారస్వామి, వెంకటస్వా మి, సాంబయ్య, సర్వు పెద్ద మల్లయ్య, సుందరయ్య, రమేశ్, గన్ను సదానందం, కాశెట్టి రాములు, రాజు, భూ తాల రాజు, గోపు రమేశ్, భూతం ప్రభాకర్, కాశెట్టి శ్రీనివాస్, దండు మహేందర్, కొత్త లింగమూర్తి, మొగిలితోపాటు మరో 20మంది నాయకు లు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ పులుకుర్తి, ల్యాదెళ్లలో డబుల్ రోడ్లు మహిళా సంఘం భవనాలు నిర్మిస్తామన్నారు. కార్యక్రమాల్లో ఎంపీ పీ కాగితాల శంకర్, సర్పంచ్లు గోవిం దు అశోక్, పున్నం రజితాసంపత్, కుక్క శ్రావణ్యఅనీల్, ఎంపీటీసీల ఫో రం మండల అధ్యక్షుడు పోలం కృపాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ జాకీర్అలీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామకృష్ణ, మెంతుల రాజు, హింగె శ్రీనివాస్, ఎడ్ల గోపాల్, దాడి రమేశ్, దండు రాజు, కన్నెబోయిన రమేశ్, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, ఎంపీవో యాదగిరి పాల్గొన్నారు.