గీసుగొండ, ఆగస్టు 27 : విమర్శలు మాని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం ఎలుకుర్తి గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. పక్కనే చెరువు ఉండడంతో కాలనీలో ఉబికి వస్తున్న నీటితో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్తో మాట్లాడారు. కట్టకు మరమ్మతులు చేయాలని సూచించారు. అనంతరం జీపీ కార్యాలయంలో 179 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత రాజకీయాలు చేయడం కాదు.. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. విపక్షాలు అభివృద్ధికి సహకరించాలన్నారు. ఉచితాలు బంద్ చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తున్నదన్నారు. అదానీ, అంబానీల రుణాలను ఎందుకు మాఫీ చేస్తున్నారని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పయనిస్తున్నదని, అర్హులకు పింఛన్ అందజేస్తామన్నారు. గ్రామంలో సీసీ రోడ్డు పనులు పూర్తి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ నీచ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పూండ్రు జైపాల్రెడ్డి, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఎంపీపీ సౌజన్య, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ మాధవరెడ్డి, మండలాధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి, తహసీల్దార్ విశ్వనారాయణ, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో ప్రభాకర్, ఏపీవో మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామానికి చెందిన మంద నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించారు.