పకడ్బందీ నిర్వహణకు ప్రణాళికలు రూపొందించండి
హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, గోపి
కలెక్టరేట్లో సమీక్ష సమావేశం.. పాల్గొన్న గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య
హనుమకొండ, మే 20 : పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి 18 వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, బీ గోపి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పీ ప్రావీణ్య, అధికారులతో పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన అంశాలు, గత పట్టణ పెండింగ్లోని అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్దేశించిన ప్రకారం వైకుంఠధామాలు, సమీకృత వెజ్, నాన్ వెజ్ మారెట్లు, క్రీడా ప్రాంగణాలు, బస్తీ దవాఖానల ఏర్పాటు, హరితహారం పురోగతిపై పలు సూచనలు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, పిచ్చి మొకలు, సీఎన్డీ గృహ నిర్మాణ వ్యర్థాల తొలగింపు, శిథిలావస్థలో ఉన్న గృహాల తొలగింపు, ప్రతి డివిజన్లో ఒక నర్సరీ, పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటు చేయాలని కలెక్టర్లు సూచించారు. ప్రతి డివిజన్లో పట్టణ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు స్థలం గుర్తించాలని, క్రీడా మైదానం ఉన్నచోట క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించాలని వారు పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో పెండింగ్ పనులు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వచ్చే హరితహారానికి జీడబ్ల్యూఎంసీ వ్యాప్తంగా 17 నర్సరీల్లో 17 లక్షల మొకలు పెంచుతున్నామని, అదనంగా కొత్త నర్సరీల ఏర్పాటుకు 30 స్థలాలను గుర్తించాలని సూచించారు. ప్రతి నర్సరీలో ప్రహరీ, నీటి సౌకర్యం, గేట్, ఆర్చీ, క్యాటిల్ ట్రాప్, మొకల పేర్ల సూచికలు ఉండాలన్నారు. గత పట్టణ ప్రగతిలో గుర్తించిన తుప్పుపట్టిన, వంగిన విద్యుత్ స్తంభాలను తొలగించామని, ఎన్పీడీసీఎల్, జీడబ్ల్యూఎంసీ అధికారులు సంయుక్తంగా పరిశీలించి ఈనెల చివరివరకు మిగిలిన స్తంభాలను తొలగించాలని సూచించారు.
పోతననగర్, తిలక్ నగర్లో వైకుంఠ ధామాల పనులు గడువులోగా పూర్తి చేయాలన్నారు. సమగ్ర వెజ్, నాన్ వెజ్ మారెట్ల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్లు ఆదేశించారు. నాలాల డిసిల్ట్టేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని, వచ్చే పట్టణ ప్రగతి విజయవంతానికి 5 డివిజన్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. అలాగే, ప్రతి డివిజన్కు అధికారి, పారిశుధ్య, ఇంజినీరింగ్, హార్టికల్చర్ అధికారులతో బృందాలను నియమించాలని సూచించారు. మహా నగరానికి 5 బస్తీ దవాఖానాల మంజూరైనందున ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు జీ సంధ్యారాణి, హరిసింగ్, వరంగల్ ఆర్డీవో మహేందర్జ్జీ, గ్రేటర్ ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సీపీ వెంకన్న, సీఎంహెచ్వో రాజిరెడ్డి, విద్యుత్, రెవెన్యూ, ఫారెస్ట్, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.