ఆత్మకూరు, అక్టోబర్ 1 : సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానాను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే, చౌళ్లపల్లి నుంచి ఒగ్గోనిపల్లి వరకు రూ.2.50కోట్లతో రోడ్డు పనులు, చౌళ్లపల్లి నుంచి ఒగ్గోనిపల్లి గ్రామం వరకు రూ.1.50కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బలరాం అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ నేతలు అవే హామీలను తెలంగాణలో ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందన్నారు. దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుంటే ఓర్వలేని విపక్ష నాయకులు పగటి వేషగాళ్లలాగా గ్రామాల్లోకి వచ్చి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.16లక్షలతో నూతనంగా పల్లె దవాఖానను ప్రారంభించుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ కక్కెర్ల రాధికారాజు, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ ఎనకతళ్ల రవీందర్,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, మార్కెట్ మాజీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంబాటి రాజస్వామి, ఎంపీటీసీ అర్షం వరుణ్గాంధీ, సర్పంచ్లు కొరే లలితారమేశ్, కంచె రవికుమార్, ఎంపీటీసీ బొమ్మగాని భాగ్యరవి, బీఆర్ఎస్ నాయకులు వేముల నవీన్, వంగాల భగవాన్రెడ్డి, అర్షం మధుకర్, మానగాని సాంబమూర్తి, కాకాని శ్రీధర్, కరివేద మహేందర్రెడ్డి, రవియాదవ్, మోరే మహేందర్, గుర్రం వేణు, పింగిళి కర్ణాకర్రెడ్డి పాల్గొన్నారు.
చంద్రయ్యపల్లిలో పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ
గీసుగొండ : మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో ఇంటి స్థలాలు లేని 50 కుటుంబాలకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ మహారాష్ట్రలో సాధ్యం కాని హమీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడం లేదని అక్కడి ప్రజలు మొత్తుకుంటున్నరన్నారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ము ఉంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో దివ్యాంగులకు రూ.4 వేలు, వృద్ధులకు రూ .2 వేల పింఛన్, రైతు బంధు, కల్యాణ లక్ష్మి, రైతు బీమా, 24 గంటల కరెంటు ఇవ్వాలన్నారు. సీఎం కేసీఆర్ను యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి పేదవాడికి పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వాసుచంద్ర, గీసుగొండ వైస్ ఎంపీపీ రడం శ్రావ్యభరత్, సర్పంచ్ ఆకుల స్రవంతి, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, తహసీల్దార్ రీయాజుద్దీన్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ లింగారెడ్డి, సర్పంచులు జైపాల్రెడ్డి. బోడకుంట్ల ప్రకాశ్, గాజర్ల గోపి, పార్టీ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి, సొసైటీ చైర్మన్ రడం శ్రీధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి రాజయ్య, నాయకులు శ్రీనివాస్, మంత రాజయ్య, డోలి చిన్ని, కార్యకర్తలు పాల్గొన్నారు.