గీసుగొండ, సెప్టెంబర్ 16: అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశానికే మార్గదర్శిగా నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన 86 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులను శనివారం హనుమకొండలోని తన నివాసంలో ఎమ్మెల్యే చల్లా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ పే దల కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ను ప్రజలు ఆశ్వీదించాలని కోరారు. రాష్ట్రం లో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ర్టాల్లో లేవ ని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమ లు చేయాలన్నారు. పరకాలను పరిపాలించిన గత పాలకులు దోచుకున్నారే తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ సాయంతో పరకాలను ఎంతో అభివృద్ధి చేసుకున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలు నమ్మొద్దని సూ చించారు. దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం కావాలని ప్రజలు అన్నారు. ఈ దేశాన్ని పరిపాలించిన కాం గ్రెస్ పార్టీ అనేక స్కామ్లో ఇరుకున్నది వాస్తవం కాదా? ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ అభివృద్ధిని మరిచి మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తహసీల్దార్ రియాజుద్దీన్, జడ్పీటీసీ పోలీ స్ ధర్మారావు, పార్టీ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి, యూత్ శ్రీకాంత్, నాయకులు శివకుమార్, శ్రీనివాస్రెడ్డి, డోలె చిన్ని, రడం భరత్, రమేశ్, కొండ రాధ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: మండలంలోని పెంచికలపేటకు చెందిన సువర్ణ, పెద్దాపురానికి చెం దిన చికిత్స కోసం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం రాత్రి హైదరాబాద్లోని తన నివాసంలో ఎల్వోసీని అందజేశారు. వారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానల్లో చికి త్స పొందుతుండగా, విషయం తెలిసిన ఎమ్మెల్యే సీఎం సహాయనిధి ద్వారా చికి త్స కోసం రూ.4.5లక్షల విలువైన ఎల్వోసీని అందజేశారు. పరకాల మున్సిపాల్ వైస్ చైర్మన్ విజయపాల్రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ సారంగపాణి పాల్గొన్నారు.