పరకాల, ఏప్రిల్ 18 : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా రూపుదిద్దుకుందని, బీఆర్ఎస్ జెండా రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దామెర మండల పరిధిలోని ముస్త్యాలపల్లి, తక్కళ్లపహాడ్, ఊరుగొండ, దామెర గ్రామాల బీఆర్ఎస్ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం దేశానికే మోడల్గా మారిందన్నారు. స్వరాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దన్నారు.
బీఆర్ఎస్లో చేరికల జోరు
నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతోంది. దామెర మండల కేంద్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ పురోగతి కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో బండి రాజు, ఎండీ సోయాల్, వర్కోటి మధు, పోతుల చంద్రమౌళి, ముప్పిడి మొగిలి, పోతుల రాములు, వర్కూటి రాజు, దామెర కిరణ్, వేల్పుల ప్రవీణ్, అరుణ్, వడ్డేపల్లి చిరంజీవి, దామెర సుమన్, జక్కుల మహేందర్, మ్మడి రమేశ్, పాక రాజు, కాసుల నరేశ్, వడ్డేపల్లి రామస్వామి, దామెర అశోక్, అఖిల్ ఉన్నారు.
ముస్లింలకు ప్రభుత్వ కానుకల పంపిణీ
పరకాల/నడికూడ : మత సామరస్యానికి తెలంగాణ రాష్ట్రం ప్రతీకగా నిలిచిందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల మున్సిపాలిటీ, పరకాల మండలానికి చెందిన పేద ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రాము నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత, మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్ స్వామి, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, జడ్పీటీసీ మొగిలి పాల్గొన్నారు. అలాగే, నడికూడ మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో కూడా ముస్లింలకు ఎమ్మెల్యే ధర్మారెడ్డి రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. అంతకుముందు గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించారు. ఈ నెల 19 వరకు శిబిరం ఉంటుందని తెలిపారు. అలాగే, మహిళా భవనం కోసం స్థలాన్ని పరిశీలించి గ్రామస్తులు, అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. గ్రామంలో పురోగతిలో ఉన్న పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ వంగ లక్ష్మి, ఎంపీపీ మచ్చ అనసూర్య, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి, పరకాల పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, బీఆర్ఎస్ నాయకులు వంగ రాజేందర్, భీముడి నాగిరెడ్డి, నందికొండ జైపాల్ రెడ్డి, కోడెపాక కరుణాకర్ పాల్గొన్నారు.