జనగామ, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్యాబినెట్ బాధ్యత వహించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేసిన కాంగ్రెస్ నిర్వాకం వల్లే దారుణం జరిగిందని మండిపడ్డారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అందాల భామల ఈవెంట్లకు వందల కోట్లు కుమ్మరించిన సర్కార్ కార్మికుల కోసం మాత్రం డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. ఈ చేతితో ఇచ్చి మరో చేతితో తీసుకునే డ్రామాలు వద్దని..దమ్ముంటే ఆర్టీసీ కార్మికులకు 44 శాతం పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.