వరంగల్, మే 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పరిపాలనను ప్రజలకు దగ్గరికి చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నది. గ్రామాల అభివృద్ధి లో కీలకమైన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యస్థీకరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత జిల్లాలకు అనుగు ణంగా కొత్త వ్యవస్థ ఉన్నది. ప్రస్తుత వరంగల్ సర్కిల్కు అ దనంగా మహబూబాబాద్ కేంద్రంగా కొత్త సర్కిల్ను ఏర్పా టు చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో రెండు సర్కిల్ కార్యాలయాలు ఉంటాయి. వరంగల్లో అదనంగా విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ విభాగం సర్కిల్ కార్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కొత్త జిల్లాలకు ఒకటి చొప్పున డివిజన్ కార్యాలయం ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసు కున్నది. కొత్తగా హనుమకొండ, భూపాలపల్లిలో డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగులో ఇప్పటికే ఈ కార్యాలయాలు ఉన్నాయి. పునర్వ్యస్థీకరణలో సబ్ డివిజన్ కార్యాలయాలు పెరిగాయి. హనుమకొండ, జనగామ, భూపాలపల్లిలో కొత్త గా విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యస్థీక రించిన నేపథ్యంలో ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా, పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని వరంగల్ సర్కిల్ ఆఫీసులో ఉద్యోగులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. పంచాయతీ ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వరంగల్ ఎస్ఈ రఘువీరారెడ్డి, ఈఈలు శంకరయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.