కరీమాబాద్, జనవరి 11 : కారులో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని, నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ జితేందర్రెడ్డి, మామునూరు ఏసీపీ నరేశ్కుమార్ వివరాలు వెల్లడించారు. పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా మామునూరు పోలీస్స్టేషన్ పరిధిలో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఓ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా గంజాయి లభించింది.
గంజాయి, కారును స్వాధీనం చేసుకుని నిందితులను విచారించగా నర్సీపట్నం నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలి స్తున్నట్లు చెప్పారు. నిందితులు షేక్జిలానీ, మహ్మద్ అఫ్రోజ్, అడ్డూరి వెంకటేశ్ను అరెస్టు చేసి, వీరి వద్ద నుంచి 86.52 కిలోల గంజాయి, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మామునూరు సీఐ క్రాంతికుమార్, ఎస్సైలు రాజేశ్రెడ్డి, కృష్ణవేణి, సిబ్బంది పాల్గొన్నారు.