హైదరాబాద్లో కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించిన తర్వాత మంత్రులు తమ చాంబర్లలో వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకొని ఆసీనులయ్యారు. వారిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయార్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ఉన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, జిల్లాల అధికారులు బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ఆదివారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ చాంబర్లో ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రజాప్రతి నిధులు కూడా పుష్పగుచ్ఛాలు అందజేశారు.