హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 8 : హనుమకొండ బస్స్టేషన్ సమీపంలోని కల్యాణలక్ష్మి షాపింగ్మాల్ను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, సినీనటి హనీరోజ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ నాణ్యమైన వస్ర్తాలను అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందించాలన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి షాపింగ్మాల్ యజమాన్యం లక్ష్మణ్దాస్ అట్టల్, ప్రదీప్ బజాజ్ మాట్లాడుతూ సరికొత్త వెరైటీలు అందుబాటులో ఉన్నాయని, ప్రారంభోత్సవం సందర్భంగా వస్ర్తాలపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నట్లు తెలిపారు.
హనీరోజ్ సందడి..
కాగా, ప్రారంభోత్సవంలో వీరసింహారెడ్డి ఫేమ్ హీరోయిన్ హనీరోజ్ సందడి చేసింది. ఆమెను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా హీరోయిన్ అభిమానులకు అభివాదం చేసింది. సెల్ఫోన్లలో ఆమె ఫొటోలు తీసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఈ సందర్భంగా హనీరోజ్ మాట్లాడుతూ కల్యాణలక్ష్మి షాపింగ్మాల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వరంగల్కు రావడం ఇదే మొదటిసారని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు శరద్కే లోయ, అంకిత లోయ, విజయ్ అటల్, ప్రదీప్ అట్టల్ పాల్గొన్నారు.