హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 18: ఉమ్మ డి వరంగల్ జిల్లాలో ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ సూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓపెన్ సూల్ ఉమ్మ డి జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం తెలిపారు. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.
ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేసినట్లు, ఆరు జిల్లాల్లో కలిపి టెన్త్లో 3,945 మంది విద్యార్థులకు 22 పరీక్ష కేంద్రాలు, 197 మంది ఇన్విజిలేటర్లను, ఇంటర్లో 7,187 మందికి 35 పరీక్ష కేంద్రాలు, 359 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వివరించారు. హాల్ టికెట్లు ‘తెలంగాణ ఓపెన్ సూల్.ఓఆర్జీ’ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు తన సెల్ నంబర్ 93460 20003కు సంప్రదించాలని కోరారు.