పాలకుర్తి రూరల్, మే 2: సోషల్ మీడియాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొని ప్రతిపక్షాల విమర్శలు, అసత్యాలు, అబద్ధాలను తిప్పికొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మం గళవారం పాలకుర్తి మండల కేంద్రంలోని బషారత్ గార్డెన్లో నిర్వహించిన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకుల సమావేశంలో మంత్రి మా ట్లాడుతూ.. సోషల్ మీడియాలో పాలకుర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలన్నారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వంపై నిత్యం అసత్య ప్రచారాలు చేస్తూ ప బ్బంగడుపుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ గానీ, తెలంగాణ ప్రభుత్వం గానీ, ఎక్కడ చిన్న తప్పు కూడా చేయదని ధీమా వ్యక్తం చేశారు. తాను కూడా తన 40ఏళ్ల రాజకీయ జీవితం లో ఎక్కడా చిన్న తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తమపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టాలని సూచించారు.
రాజకీయాల్లో పదవులు ముఖ్యం కాదని పార్టీ ముఖ్యమన్నారు. తాను 12ఏళ్లు ఏ పదవి లేకుం డా పార్టీ కోసం అంకితభావంతో పని చేశానన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు, నాయకులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. తనను నమ్ముకున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కా పాడుకుంటానని భరోసానిచ్చారు. పార్టీ లో పనితనాన్ని బట్టే పదవులు వస్తాయన్నారు. ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఒక్కో సోషల్ మీడియా కార్యకర్త 100 మందితో సమానమన్నారు. ప్రతి పక్ష పార్టీలు ప్రభుత్వాన్ని పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. అనంతరం టీఎస్ రెడ్కో చైర్మన్, సోషల్ మీడియా రాష్ట్ర బాధ్యుడు సతీశ్రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో సో షల్ మీడియా ప్రభావం అధికంగా ఉం టుందన్నారు. బీజేపీ నాయకులు సోష ల్ మీడియాను అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి మోసాలు, అసత్య ప్రచారాలను కళ్లకు కట్టినట్లు మంత్రి వివరించారు.
కేసీఆర్ పాలనలోనే గుర్తింపు
సీఎం కేసీఆర్ పాలనలోనే పండు గలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. మండలం లోని మంచుప్పులలో సర్పంచ్ బొమ్మ గాని కొమురయ్య, ఎంపీపీ నల్లా నాగి రెడ్డితో కలిసి దుర్గామాత ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బొనమెత్తి ప్రజలతో కలిసి మ మేకమై యోగక్షేమాలు అడిగి తెలుసుకు న్నారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడు తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో సక ల మతాలు, సబ్బండ వర్గాల పండుగల కు గుర్తింపు లభించిందన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పేదలకు రోగాలు వస్తే సీఎంఆర్ఎఫ్ పథకం భరోసాగా నిలుస్తుందన్నారు. ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు పార్టీ శ్రేణులు అండగా నిలబడాలని ఆయన సూచించారు. పాలకుర్తి మండలంలోని పలు గ్రామాలకు చెందిన 28 మంది బాధితులకు రూ.15లక్షల చెక్కులను అందజేశారు. ఆయన వెంట ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, సోషల్ మీడియా రాష్ట్ర బాధ్యులు ఎర్రబెల్లి రజినీకాంత్ రావు, సోషల్మీడియా నియోజకవర్గ ఇన్చార్జి వడ్లకొండ వినయ్గౌడ్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేడారపు సుధాకర్, రావుల తిరుమల్రెడ్డి, నియోజక వర్గ యూత్ అధ్యక్షుడు గడ్డం రాజు, కాసాని హరీశ్, గజ్జి సంతోష్కుమార్, ఇట్టే శ్యాంసుందర్రెడ్డి, పూస మధు, బానోతు నవీన్ నాయక్, పానుగంటి కృష్ణ, పోశాల పవన్, పసులాది ప్రశాం త్, పసుల వెంకట్, కొమ్ము సాయి, మత్తడి సాగర్రెడ్డి, తాళ్లపల్లి సంతోష్గౌడ్, ఆష్రత్ పాషా, ఎర్రసాని రామ్మూర్తి, అనుదీప్, దాసగాని భరత్, గుండె రమేశ్, దేశగాని సతీశ్, తీగల సతీశ్, నరేశ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, పాము శ్రీనివాస్ పాల్గొన్నారు.