గిర్మాజీపేట, జనవరి 31: జిల్లాలో నేత్ర వైద్య శిబిరాలకు అనూహ్య స్పందన వస్తోంది. కంటి వెలుగు కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. ప్రజలు ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయిం చుకుంటున్నారు. మంగళవారం 6,937 మంది పరీక్ష లు చేయించుకున్నారు. జిల్లాలో 44 కంటివెలుగు శిబి రాల్లో ఇప్పటివరకు 47,038 మందికి వైద్యులు కంటి పరీక్షలు చేశారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ లు, సంబంధిత డిపార్ట్మెంట్ సిబ్బంది, స్పెషలాఫీస ర్లు, వైద్యాధికారులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశ కార్యక ర్తలు అందరి సమన్వయంతో పనిచేస్తూ కంటివెలుగు ప్రోగ్రాంను ప్రజలకు చేరువ చేస్తున్నట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. కంటివెలుగు కేం ద్రాలు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నామని.. కేంద్రాల్లో సమస్య లుంటే కంటివెలుగు ఎమర్జెన్సీ మానిటరింగ్ సెల్ సెంటర్ నుంచి పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కంటివెలుగు ప్రో గాంలో పాల్గొనాలన్నారు.
మంగళవారం ఆయా ప్రాంతాల్లో కంటిపరీక్షలు చేసిన వివరాలను జిల్లా కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి డాక్టర్ గోపాల్రావు వెల్లడించారు.
దేశాయిపేట వరంగల్ 12 వార్డులో 150, 22వ వార్డులో 155, చింతల్ 35వ వార్డులో 123, 26వ వార్డులో 162, 36వ వార్డులో 162 , 21వ వార్డులో 155, ఎస్ఆర్ఆర్తోట 39వ వార్డులో 162, 32వ వా ర్డులో 140, 3వ వార్డులో 167, 3వ వార్డు పైడిప ల్లిలో 174, 17వ వార్డులో 152, ఫోర్ట్ వరంగల్ 39వ వార్డులో 167, 37వ వార్డులో 166, రంగ శాయిపేట 42వ వార్డులో 106, 41వ వార్డులో 143, గీసుగొండ 15వ వార్డులో 155, కాశీఋగ్గ 19వ వార్డులో 188, కీర్తినగర్ 16వ వార్డులో 159, గీసుగొండలో 148, సంగెంలో 246 , చెన్నారంలో 165 , ఇటుకాలపల్లిలో 170, చెన్నారావుపేటలో 162, తిరుమలాయపల్లిలో 145, ఊకల్లో 148, గవిచర్లలో 264, వంచనగిరిలో 146, మేడెపల్లిలో 101, నర్సంపేట వార్డు 22లో 148, రాయపర్తిలో 131, జల్లిలో 152, ఉప్పరపల్లిలో 157, ఖానాపూర్లో 157 , దీక్షకుంటలో 142, నె క్కొండలో 152 , నల్లబెల్లిలో 149, పర్వతగిరిలో 191, బానోజీపేటలో 170, వర్ధన్నపేట 3 వార్డు రా యపర్తిలో 146, లక్ష్మీపూర్లో 131, అలంకానిపేటలో 145 , దుగ్గొండిలో 152, చింతనెక్కొండలో 150, కొండాపూర్లో 146 మందికి కంటిపరీక్షలు నిర్వహిం చినట్లు తెలిపారు. ప్రజలందరూ విధిగా కంటి వెలుగు శిబిరాలకు నిర్ణీత సమయానికి వచ్చి పరీక్షలు చేసు కోవాలని డాక్టర్ గోపాల్రావు కోరారు.
మందులు, అద్దాలిచ్చిన్రు..
వర్ధన్నపేట: సర్కారు ఫిరీగా పరీక్షలు చేయించడం సంతోషంగ ఉంది. కొంతకా లంగా కళ్లు సక్కగ కనబడక ఇబ్బందైతాంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మా ఊళ్లె కంటివెలుగు క్యాంపు పెట్టించడంతో చాన మంది పరీక్షలు చేయించుకుంటాండ్లు. నేను కూడా పోయిన. దగ్గరి చూపు, దూరం చూపును డాక్టర్లు పరీక్షించి మందులు, అద్దాలిచ్చిన్రు. ప్రైవేటుకు పోతే చాన పైసలయ్యేవి. మా వాడోళ్లందరు పరీక్షలు చేయించుకున్రు. కేసీఆర్ సారుకు ప్రత్యేక ధన్యవాదాలు.
– చందు మల్లయ్య, వర్ధన్నపేట