ఆయిల్ పామ్ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. సబ్సిడీ ఇవ్వడంతోపాటు పుష్కలంగా సాగు నీరు ఉండడంతో రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన తర్వాత సీరోలు మండలం కొత్తూరు(సీ) గ్రామానికి చెందిన రైతు ఇంద్రసేనారెడ్డి 20 ఎకరాల్లో పంటను సాగు చేశాడు. రెండు సంవత్సరాల తొమ్మిది నెలలకు పంట చేతికొచ్చింది. రాష్ట్రంలోనే తొలిక్రాప్ 33 నెలలకు రావడం గమనార్హం. గత తొమ్మిది నెలల్లో 40 టన్నుల దిగుబడి రాగా, రూ.6.63 లక్షల ఆదాయం వచ్చింది. ఒకసారి పంటసాగు చేస్తే 30 సంవత్సరాల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో దిగుబడి మరింత పెరిగి రెట్టింపు ఆదాయం సమకూరనుంది.
మహబూబాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగా ణ): ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులను ఆర్థిక వృద్ధి లోకి తేవాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, ఖమ్మం చుట్టు పక్క ల ప్రాంతాల్లోని కొంతమంది రైతులు మాత్రమే ఆయి ల్ పామ్ సాగు చేసేవారు. కేసీఆర్ సీఎం అయిన తర్వా త ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అధిక లాభాలు వచ్చే పంటల వైపు రైతులను ప్రోత్సహిస్త్తోంది. ఆయిల్ పామ్ సాగు చేసేందుకు రైతులకు పెట్టుబడి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంది. ఆయిల్ పామ్ మొక్క లు, డ్రిప్కు రాయితీ ఇస్తున్నారు. జిల్లాను పైలట్ ప్రాజె క్టుగా ఎంపిక చేసిన తరువాత సీరోలు మండలం కొ త్తూరు (సీ) గ్రామానికి చెందిన రైతు ఇంద్రసేనారెడ్డి ముందుగా ఇరవై ఎకరాల్లో సాగు చేశాడు. ఇప్పుడు తొలి క్రాప్ చేతికొచ్చింది. 20 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలో ఆశించిన స్థాయిలో గెలలు ఉత్పత్తి అవుతున్నా యి. తొమ్మిది నెలల్లోనే 40 టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు రూ.6.63 లక్షల ఆదాయం రావడంతో రైతు ఇంద్రసేనారెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. రా నున్న రోజుల్లో దిగుబడి మరింత పెరిగి రెట్టింపు ఆదా యం వస్తుందంటున్నాడు. జిల్లాలో ఆయిల్ పామ్ వేసి న మొదటి రైతు ఇంద్రసేనారెడ్డి. ఈ పంట సాగుపై ఆయనకు పెద్దగా అవగాహన లేదని గ్రహించిన ఉద్యా నశాఖ అధికారులు అశ్వారావుపేటలో ఆయిల్ పామ్ తోటలకు వెంటబెట్టుకు పోయి చూపించారు. అక్కడ చూసిన తరువాత నమ్మకం కలిగి ఇంద్రసేనారెడ్డి తన కున్న భూమిలో ముందుగా 20 ఎకరాల్లో ఆయిల్ పా మ్ను సాగు చేశాడు. 2019 సెప్టెంబర్లో మొక్కలను నాటారు. డ్రిప్, ఆయిల్ పామ్ మొక్కలకు 90శాతం ప్రభుత్వం రాయితీ లబించింది. ఇందులో ప్రతి సంవ త్సరం అంతర పంట, ఫర్టిలైజర్ కోసం ఎకరాకు రూ.4,200ల చొప్పున బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోంది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయిల్ పా మ్ తోటల వద్దకు వచ్చి ఉద్యాన శాఖ అధికారులు పరి శీలించి రైతుకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
రాష్ట్రంలో తొలిక్రాప్..
ఆయిల్ పామ్ మొక్కలు నాటిన తర్వాత రెండవ ఏటా నుంచి గెలలు ఉత్పత్తి అవుతాయి. నాలుగేళ్ల నుంచి మంచి పంట చేతికొస్తుంది. కానీ రాష్ట్రంలో ప్ర భుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించిన తర్వా త రాష్ట్రంలోనే తొలిక్రాప్ రెండు సంవత్సరాల తొమ్మిది నెలలకు రావడం గమనార్హం. గత తొమ్మిది నెలల్లో 40 టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు రూ.6.63 లక్షల ఆదాయం వచ్చింది. రానున్న రోజుల్లో దిగుబడి మరింత పెరిగి రెట్టింపు ఆదాయం రానుంది. జిల్లాలో తొలిక్రాప్ వేసిన రైతు ఇంద్రసేనారెడ్డి వచ్చిన దిగుబడి చూసి మరో ఆరు ఎకరాల్లో ఉన్న పొలం, మామిడి తోటలను తొలగించి ఆయిల్ పామ్ సాగు చేస్తున్నాడు. ఇతనిని చూసిన తోటి రైతులు కూడా ఆయిల్ పామ్ సాగువైపు కదిలారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులను లాభదాయకమైన పంటలవైపు మళ్లించాలనే ఉద్దేశంతో దీనిని ప్రోత్సహించింది. తొలుత కొందరు రైతులు మాత్రమే ముందు కొచ్చారు. ఇప్పుడు జిల్లా లో ఆయిల్పామ్ సాగు అద్భుతమైన ఫలితాలను సాధి స్తోంది. దీంతో ఇతర రైతుల్లో ఆయిల్పామ్ సాగుపై క్రమంగా నమ్మకం పెరిగింది.
20 ఎకరాల్లో సాగు చేశా..
– ఇంద్రసేనారెడ్డి, రైతు
నా భూమిలో గతంలో జామాయిల్, మామిడి తోటలు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఆయిల్పామ్ సాగువైపు దృష్టి సారించారు. నేను అశ్వారావుపేటకు వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడి వివరాలన్ని తెలుసుకొని వచ్చాను. ఉద్యానశాఖ అధికారులతో కలిసి వెళ్లి మరోమారు పరిశీలించాను. ముందుగా 20 ఎకరాల్లో సాగు చేశా. దిగుబడి ఆశించిన స్థాయిలో రావడంతో మరో ఆరు ఎకరాల్లో ఇప్పుడు వేశాను. గత ఏడాది జూన్ నుంచి వచ్చిన గెలలను కోసి మార్కెట్కు తరలిస్తున్నాం. తోట వద్దకే వచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. చుట్టుపక్కల రైతులు వచ్చి పామాయిల్ తోటలు చూసి వారు కూడా దీని సాగు కు మర్లుతున్నారు. ఇప్పటి వరకు 40 టన్నులకు రూ.6.63 లక్షల ఆదాయం వచ్చింది. ఈ పంట సాగుకు కోతుల బెడద లేదు. ఒకసారి పంట వేస్తే 30 సంవత్సరాల వరకు కాత వస్తుంది.