రేషన్ షాపుల తరహాలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్యాస్ ఏజెన్సీల్లో ఈ -కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్)ని అమలు చేస్తున్నది. రెండు నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, దీనికి తుది గడువంటూ ఏమీ రాలేదని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు, అధికారులు చెబుతున్నారు. కేంద్రం ఆదేశాల మేరకు ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని, దశలవారీగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నామన్నారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. కస్టమర్ నంబర్, ఆధార్ నంబర్తో గ్యాస్ ఏజెన్సీకి వెళితే వినియోగదారుడి వేలిముద్రలు తీసుకొని ఈ కేవైసీ పూర్తి చేస్తున్నారు. ఇక ఇది రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా అమలు చేయనున్న రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరాకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
మహబూబాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రేషన్ షాపుల తరహాలోనే గ్యాస్ ఏజెన్సీలు తాజాగా ఈ కేవైసీ ప్రక్రియ ను ప్రవేశపెట్టాయి. మూడు నెలల క్రితం రేషన్ షాపుల్లో ఈ కేవైసీని ప్రారంభించిన కేంద్రప్రభుత్వం, ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీల్లో ఈ ప్రక్రియను అమలు చేస్తున్నది. రేషన్ షాపుల్లో రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి వ్యక్తి రేషన్ షాపునకు వచ్చి కార్డు నంబర్, ఆధార్ నంబర్, వేలి ముద్రలు ఇస్తే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో ఈ ప్రక్రియ తుదిదశకు చేరింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 70శాతం పూర్తి కాగా, మరో 30 శాతం మాత్రమే మిగి లి ఉన్నది. ఈ నెలాఖరుకు మొత్తం ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇదిలా ఉండగానే గత నెలలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీల్లో ఈ కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) సిస్టమ్ను ప్రవేశపెట్టింది. ముందు గా ఉజ్వల గ్యాస్ వినియోగదారుల ఈ కేవైసీని పూర్తి చేయాలని ఆయిల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేయగా, హెచ్పీసీఎల్ (హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్), బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్), ఐవోసీఎల్ (ఇండెన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) కంపెనీలు ఈ కేవైసీని ప్రారంభించా యి. అయితే, చాలా మంది వినియోగదారులు ఈ నెలాఖరుకే తుదిగడువు అంటూ వదంతులను నమ్మి ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తూ, వాటి ఎదుట బారులు తీరుతున్నా రు. కాగా, ఈ విషయంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకు లు క్లారిటీ ఇచ్చారు. ఈ కేవైసీ ప్రక్రియకు ఎలాంటి తుది గడువు లేదని తేల్చి చెప్పారు. దశల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏజెన్సీలు వారి పరిధిలోని వినియోగదారుల సెల్ఫోన్లకు సమాచారం అందిస్తున్నారు. గ్యాస్ కస్టమర్ నంబర్, ఆధార్ నంబర్తో వినియోగదారుడు గ్యాస్ ఏజెన్సీకి వెళితే.. సిబ్బంది ఆ వివరాలన్నీ నమోదు చేసి, వేలిముద్ర తీసుకొని ఈ కేవైసీని పూర్తి చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలో పేరు ఉన్న వినియోగదారుడు ఒక్కరే వచ్చి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఈ కేవైసీ లేకపోతే గ్యాస్ బుకింగ్ కాదనే పుకార్లను వినియోగదారులు నమ్మొద్దని నిర్వాహకులు చెబుతున్నారు.
గ్యాస్ ఏజెన్సీల్లో ఈ కేవైసీ కోసం వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియకు తుదిగడువు అంటూ ఏమీలేదు. కాకపోతే ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రూ.500కే గ్యాస్ సిలిండర్కు సంబంధించినద నే పుకార్లు వస్తున్నాయి.ఈ కేవైసీకి దానికి ఎ లాంటి సంబంధం లేదు. ఈ కేవైసీ ప్రక్రియను రెండు నెలల క్రితమే ప్రారంభించాం. ప్రస్తుతానికి ఈ కేవైసీకి తుది గడువు అంటూ ఏమీ రాలేదు. వినియోగదారులు దశలవారీగా ఈ కేవైసీ చేయించుకుంటే సరిపోతుంది.
నర్సంపేట/సంగెం,డిసెంబర్11: వంట గ్యాస్ రూ. 500లకే ఇస్తున్నారని లబ్ధిదారు లు ఈకేవైసీ చేయించు కునేందుకు హెచ్పీ, ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్ ఏజెన్సీల ఎదుట బారులు తీరుతున్నారు. సంగెం మండలంలోని తీగరాజుపల్లి గ్రామంలోని శ్రీసాయి చైత్ర ఇండియన్ గ్యాస్ కార్యాల యంలో ఈకేవైసీ చేస్తే రూ. తీసుకుంటు న్నారని మహిళలు మండిపడుతున్నారు.
నెక్కొండ మండలంలోని దీక్షకుంట మా గ్రామం. గతంలో నా భర్త మడత రామకృష్ణ పేరుమీద నెక్కొండ ఏజెన్సీలో ఇండియన్ గ్యాస్ కనెక్షన్ ఉంది. ఆయన చనిపోయిన తర్వాత నేను మా తల్లిగా రు ఊరు మొండ్రాయిలో ఉంటున్నాను. ఈకేవైసీ చేయించుకోవ డానికి సోమవారం నెక్కొండకు వెళ్లగా వారు సంగెం మండలంలో తీగరాజుపల్లి శ్రీసాయిచైత్ర ఏజెన్సీలో కనెక్షన్ ఉందని చెప్పారు. దీంతో గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి అడిగితే 2018లో తీసుకున్నావని చెప్పా రు. దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నంబర్ వేరే పెట్టి వారే తీసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలి.
శాయంపేట: మండలంలోని ప్రగతిసింగారం గ్రామంలో ఆదివారం రాత్రి రోడ్డుపై ఉన్న విద్యు త్ స్తంభాన్ని వాహనం డీకొట్టడంతో కూలి కింద పడింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపో వడంతోప్రమాదం తప్పింది. సోమవారం రోడ్డుపై పడిన స్తంభం జంపర్లు తీసేసి తొలగించినట్లు ఏఈ రాజ్కుమార్ తెలిపారు. రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను తొలగించేందుకు చర్యలు తీసు కుంటామన్నారు.