ఖానాపురం, జనవరి 3: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియలో అధికారులు జాప్యం చేయొద్దని డీసీఎస్వో గౌరీశంకర్ అన్నారు. అశోక్నగర్లో సొసైటీ ఆధ్వర్యంలో, పాకాల రైతు ఉత్పత్తి సంఘం, అయోధ్యనగర్లో గోదాదేవి మహిళా రైతు ఉత్పత్తి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని, ఎంత శాతం ఆన్లైన్లో నమోదు చేశారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు, ఆన్లైన్ ప్రక్రియ పకడ్బందీగా నడుస్తున్నదని, పాకాల రైతు ఉత్పత్తి, గోదాదేవి మహిళా రైతు ఉత్పత్తి సంఘాల ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల్లో ఆన్లైన్ ప్రక్రియ సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆన్లైన్ ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించారు. ఆయన వెంట సొసైటీ సిబ్బంది ఉన్నారు.