కొందరు అధికారులు ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారు. ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్లపై వల్లమాలిన ప్రేమ కనబరుస్తున్నారు. వారి నుంచి రావాల్సిన కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎంఆర్)ను రికవరీ చేయడం లేదు. సీఎంఆర్ ఇవ్వని రైసుమిల్లులకు ప్రభుత్వం పలు మార్లు గడువు విధించింది. అయినప్పటికీ ధాన్యాన్ని డెలివరీ ఇవ్వని ఆరు రైస్మిల్లులపై పెనాల్టీ విధించింది. దీని ప్రకా రం రూ. 29.71 కోట్ల విలువైన 9,586 టన్నుల సీఎంఆర్ను అందజేయాలని గత డిసెంబర్లో ఆయా నిర్వాహకులను ఆదేశించింది. మూడు నెలలు గడిచినా సీఎంఆర్ డెలివరీ ఇవ్వని రైస్ మిల్లర్లపై అధికారులు చర్యలకు వెనుకడుగు వేస్తుండడం విమర్శలకు తావిస్తున్నది.
వరంగల్, మార్చి 15(నమస్తేతెలంగాణ): 2019-20 ఆర్థిక సంవత్సరం వానకాలం గ్రామాల్లో రైతుల నుంచి నేరుగా మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధా న్యాన్ని సీఎంఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైస్మిల్లర్లకు కేటాయించింది. ఈ ధాన్యం పొందిన రైస్మిల్లర్లలో ఆరు మిల్లుల నిర్వాహకులు సీఎంఆర్ వందశాతం డెలి వరీ చేయలేదు. గీసుగొండ మండలం ధర్మారంలోని శ్రీరాజరాజేశ్వర ఇండస్ట్రీస్, గొర్రెకుంటలోని భూపతి ఇండస్ట్రీస్, నర్సంపేట మండలం ద్వారకాపేటలోని మహాశక్తి ఇండస్ట్రీస్, రాజుపేట శ్రీసాయి బాలాజీ ట్రేడ్ ఎక్స్, మహేశ్వరంలోని అశోకా ఇండస్ట్రీస్, వర్ధన్నపేట మండలం ఇల్లందలోని లక్ష్మిశ్రీ గణపతి ఇండస్ట్రీస్ సద రు ఆరు రైస్మిల్లుల్లో ఉన్నాయి. వీటికి ప్రభుత్వం 49, 835 టన్నుల ధాన్యం కేటాయించింది. దీన్ని ఈ మి ల్లుల నిర్వాహకులు మరపట్టి 33,888 టన్నుల సీఎం ఆర్ను 2021 మార్చి 31వ తేదీలోగా ప్రభుత్వానికి డెలివరీ చేయాల్సి ఉంది. ఇందులో నిర్దేశిత గడువు లోపు 23,563 టన్నుల సీఎంఆర్ మాత్రమే డెలివరీ చేశారు. ఇంకా 10,325 టన్నుల సీఎంఆర్ డెలివరీ ఇ వ్వాల్సి ఉంది. బకాయిపడిన ఈ సీఎంఆర్ డెలివరీ కోసం ప్రభుత్వం ఆరు రైస్మిల్లుల నిర్వాహకులకు పలుమార్లు గడువు పెంచింది. అయినా వారు ప్రభు త్వానికి ఇవ్వాల్సిన 10,325 టన్నుల సీఎంఆర్ డెలి వరీ చేయలేదు. ఈ నేపథ్యంలో 2019-20లో వాన కాలం ధాన్యం తీసుకుని సీఎంఆర్ డెలివరీ చేయని రై సుమిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు బకాయిపడిన రైస్ మిల్లర్లపై అదనంగా ఇరవై ఐదు శాతం పెనాల్టీతో సీఎం ఆర్ రికవరీ చేయాలని, పెనాల్టీతో సీఎంఆర్ డెలివరీ చేయని మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ గత డిసెంబర్ 6న ఉత్తర్వులు విడుదల చేసింది.
ప్రభుత్వ ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారు లు రంగంలోకి దిగారు. సీఎంఆర్ డెలివరీ చేయాల్సిన రైస్మిల్లుల్లో ప్రభుత్వ ధాన్యం లేదని, సదరు మిల్లర్లు పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారని విచారణలో గుర్తించారు. ధాన్యం లేదని తేలిన నేపథ్యంలో సీఎం ఆర్ బకాయి ఉన్న ఆరు రైస్మిల్లుల యజమానులతో మాట్లాడారు. ధాన్యం సమకూర్చుకుని ఇరవైఐదు శాతం పెనాల్టీతో సీఎంఆర్ డెలివరీ చేయాలని చెప్పా రు. ఈ మేరకు మూడు మిల్లుల యజమానులు కొంత సానుకూలంగా స్పందించారు. పెనాల్టీతో ధర్మారంలో ని శ్రీరాజరాజేశ్వర ఇండస్ట్రీస్ నిర్వాహకులు పెనాల్టీతో 758 టన్నుల సీఎంఆర్ డెలివరీ చేయాల్సి ఉండగా 605 టన్నులు ఇచ్చారు. ద్వారకాపేటలోని మహాశక్తి ఇండస్ట్రీస్ నిర్వహకులు 2,54 టన్నుల సీఎంఆర్ ఇవ్వా ల్సి ఉంటే కేవలం 648 టన్నులు డెలివరీ చేశారు. ఇల్లందలోని లక్ష్మిశ్రీ గణపతి ఇండస్ట్రీస్ నిర్వాహకులు 2,521 టన్నుల సీఎంఆర్ డెలివరీ చేయాల్సి ఉండగా 2,012 టన్నులు ఇచ్చారు. మహేశ్వరంలోని అశోకా ఇండస్ట్రీస్ నిర్వాహకులు 4,032 టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంటే కేవలం 53 టన్నులు డెలివరీ చేశారు. ఈ ఆరు రైస్మిల్లర్ల నిర్వాహకులు సీఎంఆర్ వంద శాతం ప్రభుత్వానికి ఇవ్వలేకపోయారు. నెలలు గడిచి పోతున్నా నాలుగు మిల్లుల నుంచి మొత్తం 3,319 టన్నుల సీఎంఆర్ మాత్రమే ప్రభుత్వానికి వచ్చింది.
ఆరు రైస్మిల్లుల నిర్వాహకులు పెనాల్టీ ప్రకారం ప్ర భుత్వానికి ఇంకా 9,586 టన్నుల సీఎంఆర్ రావల్సి ఉంది. ఒక టన్ను సీఎంఆర్ ప్రభుత్వ ధర రూ. 31,000. ఈ లెక్కన 9,586 టన్నుల సీఎంఆర్ విలు వ రూ.29.71 కోట్లు. చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి మూడు నెలలు గడిచింది. అయినా అధికా రులు సీఎంఆర్ డెలివరీ చేయని రైస్మిల్లర్లపై చర్యలకు వెనుకడుగు వేస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర జిల్లాల్లో 2019-20 వానకాలం సీఎంఆర్ డెలి వరీ చేయని రైస్మిల్లర్లపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. జిల్లాలో మాత్రం ఇప్పటివరకు అధికారులు రెండు రైస్మిల్లుల నిర్వాహకులపై మాత్ర మే చర్యలు తీసుకోగలిగారు. కొద్దిరోజుల క్రితం గొర్రె కుంటలోని భూపతి ఇండస్ట్రీస్, రాజుపేటలోని శ్రీసా యి బాలాజీ ట్రేడ్ ఎక్స్ను సందర్శించి వాటి నిర్వాహ కులపై కేసు నమోదు చేశారు. మహేశ్వరంలోని అశోకా ఇండస్ట్రీస్ నిర్వాహకులు 3,978 టన్నుల సీఎంఆర్ డెలివరీ చేయాల్సి ఉంది. దీని విలువ అక్షరాల రూ. 12.33 కోట్లు. ద్వారకాపేటలోని మహాశక్తి ఇండస్ట్రీస్ నిర్వాహకులు 1,406 టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. దీని విలువ రూ.4.35 కోట్లు. ఇల్లందలోని లక్ష్మి శ్రీ గణపతి ఇండస్ట్రీస్ నిర్వాహకులు ఇవాల్సిన 509 టన్నుల విలువ రూ.1.57 కోట్లు. ధర్మారంలోని శ్రీ రాజరాజేశ్వర ఇండస్ట్రీస్ నిర్వాహకులు డెలివరీ చేయా ల్సిన 152 టన్నుల విలువ రూ.47 లక్షలు. ఇలా బకా యి ఉన్న రైస్మిల్లర్లను అధికారులు ఉపేక్షిస్తుండడం రైస్ ఇండస్ట్రీస్లో చర్చనీయాంశమైంది. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఇర్పాన్ను ‘నమస్తేతెలంగాణ’ వివరణ కోరగా సీఎంఆర్ డెలివరీ చేయని ఆరు రైస్ మిల్లుల్లో రెండు మిల్లుల నిర్వాహకులపై కేసులు నమో దు చేశామని, వారి బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేశా మని చెప్పారు. ఇతర రైస్మిల్లుల నిర్వాహకులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.