నల్లబెల్లి, డిసెంబర్ 26 : కార్యకర్తల సంక్షేమమే ప్రథమ కర్తవ్యమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మా మిండ్లవీరయ్యపల్లె గ్రామానికి చెందిన కాంగ్రె స్ నాయకులు పెంతల రాజు, అజయ్, ఎర్ర నాగరాజు నర్సంపేట క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, పీ ఏసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, గందె శ్రీనివాస్గుప్తా, హింగ్లి శివాజీ, గ్రామ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, కార్యదర్శి కిశోర్, ఉప సర్పం చ్ అనంతరెడ్డి, ఆసం చెంద్రమౌళి, మోహన్, పెంతల సాంబరెడ్డి, కూస కొంరెల్లి, శంకర్, మధూకర్, గోవర్ధన్, మల్లారెడ్డి, సంపత్, శంకర్, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోడ్లకు రూ.40.30 కోట్లు..
నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గంలోని బీటీ రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలో ఆయన మాట్లాడుతూ.. బీటీ రెన్యువల్స్, నూతన రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.40.30 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తికావచ్చిందని, వారంలో పనులు ప్రారంభం కానున్నాయని వివరించారు. నిధుల మంజూరుకు సహకరించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రశాంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లు ధ్వంసం అయ్యాయని, ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణలో ఈ రోడ్ల పనులు జరుగుతాయని తెలిపారు. నెక్కొండ నుంచి ఇనుగుర్తి వరకు వయా సాయిరెడ్డి పల్లి మీదుగా రూ.12 కోట్లు, నర్సంపేట నుంచి నెక్కొండ వరకు రూ.6.70 కోట్లు, నర్సంపేట నుంచి వరంగల్ వరకు రూ.5.32 కోట్లు, నెక్కొండ నుంచి ఇంటికన్నె వరకు రూ.2.48 కోట్లు, చెన్నారావుపేట నుంచి గుండెంగ వరకు వయా పాపయ్యపేట మీదుగా రూ.2.46 కోట్లు, నర్సంపేట నుంచి నల్లబెల్లి వరకు వయా మాదన్నపేట మీదుగా రూ.96 లక్షలు, చెన్నారావుపేట నుంచి ఉప్పరపల్లి వరకు నూతన సీసీ రోడ్డుకు రూ.2.50 కోట్లు, పనికర నుంచి మచ్చాపూర్ వరకు వయా దీక్షకుంట మీదుగా రూ.2.38 కోట్లు, జల్లి నుంచి లింగగిరి వరకు రూ.1.50 కోట్లు, మహ్మద్ గౌస్ పల్లి నుంచి నందిగామ గ్రామాల మధ్యలో బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.2.10 కోట్లు, మహ్మద్ గౌస్ పల్లి, నందిగామ మధ్య బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.2.90 కోట్లు మంజూరయ్యాయని వివరించారు.