తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలు
నియోజకవర్గానికి 57 హెల్త్ సబ్ సెంటర్లు మంజూరు
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
గొల్లపల్లెలో హెల్త్ సబ్సెంటర్ ప్రారంభం
నల్లబెల్లి, జూన్ 17 : నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గొల్లపల్లె గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన హెల్త్ సబ్సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రానున్న రోజుల్లో నర్సంపేట హెల్త్హబ్గా మారనున్నదన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారంతో నియోజకవర్గానికి 57 హెల్త్ సబ్ సెంటర్లతో పాటు సొంత భవనాలు నిర్మించేందుకు నిధులు కూడా మంజూరు చేశారన్నారు. మొత్తం సబ్సెంటర్ల సంఖ్య 59కి చేరిందన్నారు. మూడు నెలల్లో వీటి నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీనిచ్చారు. తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తామన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో ప్రకాశ్, ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బా నోత్ సారంగపాణి, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్గౌ డ్, వైద్యాధికారి శశికుమార్, సర్పంచ్ దాసు పూలమ్మ పాల్గొన్నారు. అనంతరం పంతులుపల్లె గ్రామానికి చెం దిన టీఆర్ఎస్ కార్యకర్త ఊరటి లింగారెడ్డి అనారోగ్యం తో మృతిచెందగా, కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పెద్ది పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ ఊరటి అ మరేందర్రెడ్డి, ఎంపీటీసీ ఏడాకుల రవీందర్రెడ్డి, గ్రామ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, నాయకులు కిశోర్, అనంతరెడ్డి, మధుకర్, సాంబరెడ్డి, రాజిరెడ్డి, శ్రీకాంత్, చంద్రమౌళి, గోవర్ధన్, కొమురెళ్లి ఉన్నారు.
ఆలయాల అభివృద్ధికి కృషి..
దుగ్గొండి : ఆలయాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభు త్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది అన్నారు. మండలంలోని మందపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే పెద్ది ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మొగ్గం మహేందర్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, కంచరకుంట్ల శ్రీనివాస్రెడ్డి, బ్రహ్మం, నూతనకంటి శ్రీనివాస్, జగదీశ్, లింగాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు
ఇటుకాలపల్లిలో..
నర్సంపేట రూరల్ : ప్రజలకు మరింత చేరువగా వైద్యసేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలో రూ. 16 లక్షలతో నిర్మించిన నూతన హెల్త్ సబ్సెంటర్ను ప్రారంభించారు. అ నంతరం గ్రామంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, డిప్యూటీ డీఎంహెచ్వో ప్రకాశ్, ఎంపీడీవో అంబటి సునీల్కుమార్రాజ్, సర్పంచ్ మండల రవీందర్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు భూక్యా వీరన్న, పీహెచ్సీ వైద్యాధికారి భూపేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నామాల సత్యనారాయణ, ఈర్ల నర్సింహరాములు, మాజీ మండలాధ్యక్షుడు మచ్చిక నర్సయ్యగౌడ్, డిప్యూటీ తహసీల్దార్ ఉమారాణి, ఎస్సై బొజ్జ రవీందర్, మాజీ సర్పంచ్ సున్నం కొమ్మాలు, ఉపసర్పంచ్ జామాండ్ల చంద్రమౌళి, మాజీ ఎంపీపీ నల్ల మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.