నెక్కొండ, నవంబర్ 7: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పరుగులు పెడుతున్న అభివృద్ధికి కేసీఆరే గ్యారెంటీ ముఖ్యమంత్రి అని, సరైన గ్యారెంటీలు లేని కాంగ్రెస్ పార్టీని, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని నమ్మి ప్రజలు మోసపోవద్దని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. మండలంలోని రామన్నకుంటతండా, టేకులకంటతండా, అమీన్పేట, పనికర, దీక్షకుంట, దేవునితండా, సీతారాంపురం, ముదిగొం డ, హరిశ్చంద్రుతండా, బంజరుపల్లి, వాగ్యానాయక్తండా, మూడుతండా, గొల్లపల్లి, చంద్రుగొండలో మంగళవారం ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దికి ప్రజలు బతుకమ్మలు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ప్రజా ఆశీస్సులతో ప్రచారయాత్ర ఉప్పెనలా సాగింది. ప్రతి గ్రామం, తండాలో డప్పుచప్పుళ్ల మధ్య ర్యాలీ నిర్వహించారు. దీంతో గ్రామాలన్నీ గులాబీమయమయ్యాయి. ఊరువాడ ఏకమై ప్రజలు ఆశీర్వదించారు. ర్యాలీలో ప్రజలు, నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఒకరంటే మరొకరికి గిట్టదని, అభివృద్ధి ఎలా జరుగుతదో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. గ్రామాల్లో దొంతి, రేవూరి వల్ల నాయకులు, ప్రజలు ఘర్షణ పడ్డారని, నేడు వారు ఒక్కటై నీతిమాలిన కుట్రలకు తెరలేపారని వివర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలంటున్నాడని, సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారని, ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. తెలంగాణ సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలంటే మరోసారి కేసీఆర్ను సీఎం చేయాలని కోరారు.
తాను ఎమ్మెల్యేగా గెలిచిన ఐదేళ్లలో నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపానని పెద్ది అన్నారు. దొంతి, రేవూరి కాలంలో జరిగిన అభివృద్ధి ఏపాటిదో ప్రజలకు తెలుసునన్నారు. తాను మారుమూల పల్లెలు, తండాలకు సైతం రోడ్లు వేయించానని, మౌలిక వసతులు కల్పించానని చెప్పారు. రైతులు అకాల వర్షాలకు పంట నష్టపోతే ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇప్పించానని గుర్తుచేశారు. 50 శాతం సబ్సిడీపై నియోజకవర్గంలోని రైతులకు రూ. 75 కోట్ల విలువైన వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, పరికరాలు మంజూరు చేయించానని వివరించారు.
నియోజకవర్గంలో ప్రతిపక్షాల ఉనికే లేదని పెద్ది ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయలో మాత్రమే వస్తున్నారని విమర్శించారు. తాను 50 వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రచార ర్యాలీలో ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్యా సరోజా హరికిషన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, నెక్కొండ, రెడ్లవాడ, సూరిపల్లి సొసైటీల చైర్మన్లు రాము, సంపత్రావు, దామోదర్రెడ్డి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కొమ్ము రమేశ్యాదవ్, సీనియర్ నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సూరం రాజిరెడ్డి, కట్కూరి నరేందరెడ్డి, గుంటుక సోమయ్య, సర్పంచ్లు ఆలకుంట సురేందర్, పింగిళి విజయా మోహన్రెడ్డి, విజయా ప్రతాప్సింగ్, రాజమ్మ, విజయా వెంక న్న, స్వరూప-రవి, శైలాజా ప్రభాకర్, చంద్రమౌళి, వీరూనాయక్, విజయా వెంకన్న, రవీందర్, నాయకులు గాదె భద్రయ్య, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. అలాగే, గొల్లపల్లి, చంద్రగొండ గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నియోజ కవర్గ ఎన్నికల పరిశీలకుడు వీ ప్రకాశ్, జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న పాల్గొన్నారు.
నర్సంపేట: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదని, ఆ పార్టీ నాయకుల మాటలను ఎట్టి పరిస్థితిలో నమ్మొద్దని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. పట్టణంలోని 18వ వార్డు లెనిన్నగర్కు చెందిన కార్యకర్తలు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని విమర్శించారు. గతంలో చాలాసార్లు కాంగ్రెస్కు ప్రజలు అధికారమిచ్చారని గుర్తుచేశారు. ఆ సమయంలో ప్రజలను నయవంచన చేసింది హస్తం పార్టీ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో పెండెం రమేశ్, అన్న రాజు, బొజ్జ సన్నీ, వేమునూరు రాజు, పొన్నాల మోహం, కడారి అనిల్, గౌరబోయిన సదానందం ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోగుల రాణాప్రతాప్రెడ్డి, రాయరాకుల సారంగం పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్/నల్లబెల్లి: బీఆర్ఎస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే పెద్ది సమక్ష్యంలో బీఆర్ఎస్లో చేరారు. గ్రామానికి చెందిన ఇప్ప నాగులు, ఎలకంటి శ్రీను, వీరమల్ల స్వామి, మిడిగొండ చంద్రమౌళి, వంగ రవితోపాటు మరికొంత మంది బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే నర్సంపేటను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, సర్పంచ్ బరిగెల లావణ్య-కిశోర్కుమార్, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు జర్పుల వీరన్న, నాయకులు సుంకరి సంతోష్రెడ్డి, నాగరాజు, రాజన్న పాల్గొన్నారు. అలాగే, నల్లబెల్లి మండలంలోని ఆసరవెల్లి, నందిగామ, ముచ్చింపుల, గొల్లపల్లి, నల్లబెల్లి, రాంపూర్, మేడెపల్లి గ్రామాలకు చెందిన 200 కుటుంబాలు కాంగ్రెస్ నుంచి పెద్ది సమక్షంలో బీఆర్ఎస్ లో చేరాయి. పార్టీలో చేరిన వారిలో బొట్ల పవన్, కొయ్యడ కుమారస్వామి, సత్పల రాజ్కుమార్, ఆవుల మహేందర్, బీజేపీ వార్డు మెంబర్ ప్రదీప్కుమార్, జినుకల నరేశ్, మేకల నరేశ్, నాగెల్లి ప్రణీత్, సీపీఐఎంఎల్ ప్రజాపంథ డివిజన్ నాయకుడు కందిక రమేశ్తోపాటు పలువురు దళితులతోపాటు బీజేపీ, కాంగ్రెస్ నుంచి మరో 180 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, నాయకులు ఊడుగుల ప్రవీణ్గౌడ్, రాజేశ్వర్రావు, శ్రీనివాస్గౌడ్, సర్పంచ్ సురేశ్రావు, క్లస్టర్ ఇన్చార్జి ప్రభాకర్రావు, తిరుపతినాయక్ పాల్గొన్నారు.