వరంగల్ : దళితుల గౌరవం ఇనుమడింప చేసే విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అంబేద్కర్ స్ఫూర్తితో దళిత బంధుతో పాటు అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తురన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణను రోల్ మోడల్గా నిలిచిందన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం దళితులపైన ప్రేమ ఉన్నా పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు కడియం కృతజ్ఞతలు తెలిపారు.