గీసుగొండ/సంగెం, నవంబర్ 3 : పరకాల నియోజకవర్గం ప్రజలే తన బలం, బలగం అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని కొమ్మాల, సూర్యతండా, విశ్వనాథపురం, నందనాయక్తండా, దస్రుతండా, సంగెం మండలంలోని వంజరపల్లి, కృష్ణానగర్, చింతలపల్లి గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ మనకు ఏం చేసిందో ఆలోచించాలని కోరారు. ఇప్పుడు మళ్లీ ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ మోసపూరిత హామీలను ఇస్తున్నారని, జాగ్రత్త ఉండాలన్నారు. కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 24 గంటల కరెంటు ఎట్ల ఇస్తుందని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతున్నదన్నారు.
ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పటికే మూడు నియోజకవర్గాలు మారి వచ్చాడని, ఆయనను నమ్మితే గ్రామాలు మళ్లీ అంధకారంలోకి వెళ్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు వాంకుడోత్ రజిత, వీరాటి కవిత, అంకతి నాగేశ్వర్రావు, బదావత్ అమ్మి, కేలోత్ సరోజన, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మండలాధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, కార్యదర్శి చల్లా వేణుగోపాల్రెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ వీరాటి లింగారెడ్డి, గ్రామాల అధ్యక్షులు రాజ్కుమార్, వినోద్, గుగులోత్ రాజు, భూక్యా అఖిల్, మోతీలాల్, సమన్వయ కమిటీ సభ్యులు బోడకుంట్ల ప్రకాశ్, రడం భరత్, రవీందర్రెడ్డి, ముంత రాజయ్య. మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి రాజయ్య, నాయకులు కుమారస్వామి, వీరస్వామి, బాల్రాజు, నర్సింగం, తిరుపతి, రవీందర్రెడ్డి, స్వామి, రవీందర్, రమేశ్, కృష్ణారెడ్డి, సురేందర్, భిక్షపతి, వీరన్న, చంద్రారెడ్డి, రమేశ్, ఎల్లా స్వామి, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, సర్పంచ్లు పెంతల స్రవంతి అనిల్, కొడారి మోహన్, ఎంపీటీసీలు గుగులోత్ వీరమ్మ-గోపీసింగ్, బొమ్మ పావనీయుగేంధర్, కందకట్ల నరహరి పాల్గొన్నారు.