హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 14: క్షణికావేశంలో అన్ననను తమ్ముడు నరికి చంపిన ఘటన హనుమకొండ కుమార్పల్లిలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా అనుమానిస్తున్నారు. స్థానికులు, హనుమకొండ సీఐ సీహెచ్.శ్రీనివాస్జీ తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్పల్లికి చెందిన గొర్రె రాధాబాయి-నర్సయ్యకు ముగ్గురు కూతుర్లు, ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు గొర్రె శంకర్(46) రెండో కొడుకు రాజకుమార్కు పెళ్లి కాలేదు. ముగ్గురు అమ్మాయిలకు, చిన్న కొడుకుకు వివాహమైంది. సుమారు 20 సంవత్సరాల క్రితం భర్త నర్సయ్య చనిపోయాడు. శంకర్ పెయింటర్గా పనిచేస్తుండగా, రాజ్కుమార్ ఆటో నడుపుతున్నాడు. వీరికి పెళ్లికాకపోవడంతో తల్లితో ఉంటున్నారు.
రాజ్కుమార్ ఓ అమ్మాయితో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. అన్న శంకర్ చాలాసార్లు గమనించి తమ్ముడు రాజ్కుమార్ను మందలించాడు. నా విషయంలో జోక్యం చేసుకుంటే ఎప్పటికైనా ఏదో ఒక రోజు చంపుతానని అన్నను రాజ్కుమార్ బెదిరించేవాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో శంకర్తో రాజ్కుమార్ గొడవపడ్డాడు. క్షణికావేశంలో గొడ్డలితో శంకర్పై దాడి చేశాడు. ఈ ఘటనంలో తీవ్రంగా గాయపడిన శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడని సీఐ శ్రీనివాస్జీ తెలిపారు. తల్లి రాధాభాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు ఆయన తెలిపారు.