ములుగు : సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా శనివారం మేడారం(Medaram) లో మంత్రి సీతక్క(Minister Seetakka) ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్( RTC bus stand ) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతరకు గతంలో కంటే రెట్టింపుగా 6వేల ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది ఓపికతో బస్సులు నడపాలని, భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని, ప్రయాణం చేసే భక్తులు సంతోషంగా వచ్చి వెళ్లేలా చూడాలని కోరారు.
పైసా ఖర్చు లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేశారని తెలిపారు . బస్ టికెట్ కౌంటర్స్(Ticket Counters), క్యూ లైన్స్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరిష్, ఆర్టీసీ వరంగల్ ఆర్ ఎం శ్రీలత, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.