పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రంలో రూ.19 కోట్లతో మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల విద్యాలయాన్ని సకల హంగులతో నిర్మించింది. జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో ఐదెకరాల్లో జీప్లస్-2 విధానంలో 20 తరగతి గదులు, ఐదు అత్యాధునిక ల్యాబ్లు, లైబ్రరీ, డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. గురుకులం ప్రారంభోత్సవంతో పాటు భూపాలపల్లి పట్టణంలో రూ.105 కోట్లతో చేపట్టనున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్, మినీ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, జంగేడు రోడ్డు వెడల్పు వంటి పలు అభివృద్ధి పనులకు ఈ నెల 7న మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. పర్యటన ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే గండ్ర, వరంగల్ జడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పరిశీలించారు.
(నమస్తే తెలంగాణ)/ భూపాలపల్లి రూరల్
జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : కేజీ టు పీజీ విద్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ భూపాలపల్లిలోని మొగుళ్లపల్లి మండలకేంద్రంలో మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల విద్యాలయాన్ని సకల హంగులతో నిర్మించింది. రూ.19 కోట్ల నిధులు వెచ్చించి అధునాతన హంగులతో భవన సముదాయాన్ని తీర్చిదిద్దారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో విద్య అందించేందుకు బీసీ వెల్ఫేర్ బాలుర రెసిడెన్సియల్ పాఠశాలను సుమారు ఐదెకరాల్లో జీప్లస్-2 విధానంలో ప్రభుత్వం నిర్మించింది. 20 తరగతి గదులు, ఐదు అత్యాధునిక లాబోరేటరీలు, లైబ్రరీ హాల్, ఒకే సారి 320 మంది విద్యార్థులు భోజనం చేసేలా డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. గురుకులాన్ని ఈ నెల 7న మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్తో మంత్రి కేటీఆర్ కలిసి ప్రారంభించనున్నారు.
పూలే బీసీ వేల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర గురుకుల విద్యాలయంలో ఇంగ్లిష్ మీడియంలో 5వ తరగతి నుం చి ఇంటర్ వరకు విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పించారు. 5 నుంచి10వ తరగతి వరకు ప్రతి తరగతిలో రెండు సెక్షన్ల చొప్పున సెక్షన్కు 40కి ప్రవేశాలు కల్పించనున్నారు. పాఠశాల స్థాయి వరకు సుమారు 480 మంది విద్యార్థులకు, ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ విభాగా ల్లో మొదటి, రెండో సంవత్సరంలో ప్రతి యేడు 30 మం దికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. సీఈసీలో మాత్రం ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ప్రతి సంవత్సరం 20 మంది చొప్పున 160 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించా రు. అలాగే వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టి విద్యాభ్యా సం పూర్తయిన తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విద్యా విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తు తం ఆన్లైన్లో భోదన జరుగుతున్నది. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రత్యక్ష భోదన సమయానికి గురుకుల విద్యాలయం అందుబాటులోకి రానున్నది.
విద్యార్థులకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందించేందుకు ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకు నిర్మించారు. అలాగే రెండు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి రక్షిత తాగు నీటిని అందించనున్నారు.
భూపాలపల్లి రూరల్, ఫిబ్రవరి 5 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూపు రేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 7న జిల్లాలో మంత్రులు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి భారీ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. దీంతో శనివారం ఎమ్మెల్యే గండ్ర, వరంగల్ జడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మంత్రుల పర్యటనకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోమవారం మంత్రులు డబుల్ బెడ్ రూమ్ ఇడ్లను ప్రారంభించడంతో పాటు, సుమారు రూ.105 కోట్లతో చేపట్టనున్న భూపాలపల్లి స్పోర్ట్స్ కాంప్లెక్స్, మినీ స్టేడియం, స్విమింగ్ పూల్, జంగేడు రోడ్డు వెడల్పు వంటి పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాన చేయనున్నట్లు చెప్పారు. సుభాష్కాలనీ, కృష్ణకాలనీలో నివసిస్తున్న 1,100 మందికి ఇండ్ల పట్టాలు అందజేస్తారని తెలిపారు.
భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగలో మంత్రులు పాల్గొంటారని తెలిపారు. భారీ బహిరంగ సభకు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. గండ్ర జ్యోతి మాట్లాడుతూ మంత్రుల పర్యటనను పండుగ వాతావరణంలో కొనసాగించాలన్నారు. మంత్రి కేటీఆర్కు భూపాలపల్లి పట్టణంలో ఉన్న సమస్యలు వివరించనున్నట్లు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్కాలనీలో దాతల సహకారంతో నిర్మిస్తున్న పోచమ్మ గుడి స్లాబు నిర్మాణ పనులను ఎమ్మెల్యే గండ్ర దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గండ్ర గౌతమ్ రెడ్డి, భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టీఆర్ఎస్ భూపాలపల్లి అధ్యక్షుడు కటకం జనార్దన్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బీబీచారి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.