ములుగు : జెడ్పీ కో-ఆప్షన్ మెంబర్ రియాజ్ మీర్జాపై వేటుపడింది. టీఆర్ఎస్ పార్టీ నిర్ణయాలను ధిక్కరించడంతో పార్టీ నుంచి అతడిని బహిష్కరించారు. బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతూ
ములుగు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పై అవిశ్వాస తీర్మాన సమావేశ విషయంలో కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీకి రియాజ్ మోసం చేశాడు. దీంతో అధిష్ఠానం ఆదేశాల మేరకు పార్టీ నుంచి బహిష్కరిస్తూ
జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఆదేశాలు జారీ చేశారు.
ములుగు గ్రామ పంచాయితీ వార్డు మెంబర్గా కొనసాగుతున్న రియాజ్ మీర్జాను జెడ్పీ కో-ఆప్షన్ గా టీఆర్ఎస్ పార్టీ నియమించిది. కానీ ఈ నెల 16వ తేదీన ములుగు ఉప సర్పంచ్ పై చేపట్టిన అవిశ్వాస తీర్మానం సమావేశ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో చేతులు కలిపి మోసం చేశాడు. అన్ని ఆధారాలు పరిశీలించి రియాజ్ మిర్జాను పార్టీ నుంచి బహిష్కరించామని జగదీష్ తెలిపారు.