భూపాలపల్లి టౌన్, ఆగస్టు 26 : అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని, ఇక్కడ అమలవుతున్న పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన భూపాలపల్లి మండలం నేరేడుపల్లి, వజినపల్లి, గొర్లవీడు, గుడాడ్పల్లి, కొంపెల్లి గ్రామాల్లో సర్పంచ్లు దానవేన రమ రమేశ్, తాళ్లపల్లి స్వామి, మొయినొద్దీన్, ఉడుత లక్ష్మీఐలయ్య యాదవ్, కాసగాని కవితాదేవెందర్ అధ్యక్షతన కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు పింఛన్ పత్రాలను, కార్డులు అందజేశారు. కొంపెల్లి గ్రామంలో కలెక్టర్ భవేశ్మిశ్రా లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ.. మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ర్టాల కంటే తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ముందున్నదన్నారు. ఉత్తమ గ్రామ పంచాయతీల్లో తెలంగాణ రాష్ట్రం ముందు న్న విషయం కేంద్రమంత్రే స్వయంగా పార్లమెంట్లో ఒప్పుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికి ఆదర్శమన్నారు. ఇంతపెద్ద మొత్తం పింఛన్లు ఏ రాష్ట్రంలోనూ అందించడం లేదన్నారు. గ్రామాలను ప్ర ణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఏ పని చేసినా పైసలు తింటున్నాడని ఆరోపిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చినట్లు బీజేపీ నాయకులు ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డా రు.
రాష్ట్ర నిధులతోనే మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూ ర్తి చేసి రైతాంగంలో మనోధైర్యం నింపారని అన్నారు. ప్రధాని మోదీ మాత్రం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతూ అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నాడని విమర్శించారు. నల్లధనం తీసుకొచ్చి పేదలకు పంచుతానని ప్రగ్భాలు పలికి, కుబేరుల రుణాలను మాఫీ చేయిస్తున్నారని అన్నారు. మన కరంటుపై ఆంక్షలు విధిస్తే కేసీఆర్ బెదరలేదన్నారు. గిరిజన యూనివర్సిటీ, ఉక్కు ఫ్యాక్టరీ ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక కేసీఆర్ కుటుంబంపై మచ్చ తేవాలని కుట్ర పన్నుతున్నారని, తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు.
రూ. 2వేల పింఛన్ ఎక్కడా లేదు: కలెక్టర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న రూ. 2వేల ఆసరా పింఛన్ ఏ రాష్ట్రంలో లేదని కలెక్టర్ భవేశ్మిశ్రా అన్నారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వం పింఛన్లు ఆపకుండా అందించడం గొప్పవిషయమన్నారు. ఇతర రాష్ర్టాల్లో పింఛన్లు తక్కువగా ఇవ్వడమే కాకుండా, కరోనా సమయంలో తగ్గించి ఇవ్వడం, కొన్ని రాష్ర్టాల్లో మొత్తమే నిలిపివేయడం జరిగిందన్నారు. పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవినీతి అక్రమాలు ఉండవని, అంతా ఆన్లైన్లోనే జరుగుతుందన్నారు. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా, నేరేడుపల్లిలో 42, వజినెపల్లిలో 11, గొర్లవీడులో 115, కొంపెల్లిలో 50, గుడాడ్పల్లిలో 36 పిం ఛన్లు మంజూరుకాగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి పిం ఛన్ మంజూరు పత్రాలు అందజేశారు. ఆయా కార్యక్రమా ల్లో జడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభారఘుపతిరావు, ఎంపీపీ మందల లావణ్యాసాగర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్యాదవ్, డీఆర్డీవో పురుషోత్తం, ఎంపీడీవో అనిల్, పీఏసీఎస్ డైరెక్టర్లు కౌటం లక్ష్మయ్య, గౌడ మహేశ్, సంపత్రావు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బొనగాని రమేశ్, నాయకులు మందల రవీందర్రెడ్డి, చిందం కిరణ్, పింగిళి రవిందర్రెడ్డి పాల్గొన్నారు.