హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల భవిష్యత్తు నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలను కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమగ్ర నివేదిక పంపాలని సంబంధిత అధికారులను నీటిపారుదలశాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి ఈ సం దర్భంగా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.