హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి సమీపంలో కొత్తగా నిర్మించిన రైల్వేస్టేషన్ను ఈ నెల 26న(ఆదివారం) ప్రారంభించనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది. రూ. 6 కోట్ల వ్యయంతో రైల్వేస్టేషన్ను నిర్మించామని, కేంద్ర మంత్రులు జీ కిషన్రెడ్డి, బండి సంజయ్కుమార్ ఈ స్టేషన్ను ప్రారంభిస్తారని సంస్థ సీపీఆర్వో ఏ శ్రీధర్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాత్సవ, హైదరాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ సంతోష్కుమార్ వర్మ పాల్గొంటారని పేర్కొన్నారు.
తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి – చర్లపల్లి మధ్య రెండు ప్రత్యేకరైళ్లు నడపనున్నట్టు శ్రీధర్ వెల్లడించారు. ఈ నెల 26న తిరుపతి -చర్లపల్లి, 27న చర్లపల్లి -తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు.