ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 12 గంటల వ్యవధిలోనే తల్లి, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని వెంకటాపురం మండలం మొర్రివానిగూడెంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన 50 ఏళ్ల దేవమ్మ కూతురు దీపప్రియ నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. కూతురు మృతి చెందిందన్న విషయాన్ని జీర్ణించుకోలేని దేవమ్మ కూడా ఇవాళ మృతి చెందింది. 12 గంటల వ్యవధిలోనే తల్లీకూతురు ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.