ములుగు : పర్యాటక ప్రాంతం లక్నవరం వద్ద కారు బోల్తా పడింది. స్థానికుల కథనం మేరకు..హైదరాబాద్కు చెందిన ఆరుగురు పర్యాటకులు కారులో లక్నవరం వెళ్తున్నారు. కాగా, గోవిందరావుపేట మండలం చల్వాయి నుంచి బుస్సాపూర్ మీదుగా లక్నవరం వెళ్లే రహదారిలో ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.